Suryanarayana Raju: బీజేపీకి ఎవరూ రాజీనామా చేయలేదు..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో పదవలు నుంచి నేతల తొలగింపు, రాజీనామా పర్వం కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది.. దానిపై ఆ పార్టీ నేతలే స్వయంగా మీడియా ముందుకు రావడం చర్చగా మారింది.. అయితే, మా పార్టీలో ఎవరూ రాజీనామాలు చేయలేదు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలకు ఒక డేట్ లేకుండా చేసిందని ఆరోపించారు.. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదు. ఐదు నెలలుగా ఎప్పుడు జీతాలు ఇస్తామో ప్రభుత్వానికే తెలియని పరిస్థితి ఉందన్నారు. ఈ నెలలో సంక్రాంతి పండుగ ఉన్నందున్న జీతాలు ఆలస్యంగా ఇస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడతారు.. ప్రభుత్వం స్పందించి జీతాలు, పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Bonda Uma: కందుకూరు, గుంటూరు ఘటనలపై సీబీఐ ఎంక్వయిరీ వేయండి..
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ఇక, రైతులు ధాన్యానికి కూడా యాభై శాతం చెల్లింపులు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని విమర్శించారు సూర్యనారాయణరాజు.. ఉపాధ్యాయుల బదిలీ విద్యా సంవత్సరం ఆరంభంలో చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం పరీక్షల సమయంలో బదిలీలు చేయడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.. జీవోలు ప్రజల కోసమంటారు.. ప్రజలకు చూపించరు అని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. స్పీకర్ ఏకంగా తొడ గొడతారు.. ఛాలెంజీలు చేస్తారని మండిపడ్డారు.. స్పీకర్గా ఆ పదవికి హుందాతనం తేవాలి అని హితవుపలికారు. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు పెరిగాయి. దౌర్జన్యం చేసిన వారిని వదిలేసి.. బాధితులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. ఇసుక మాఫియాపై బీజేపీ ప్రశ్నిస్తే స్పందించరు.. ఏపీలో ఇసుక, మద్యం, భూ మాఫియాలతో మాఫియా ప్రభుత్వంగా పేరు గడించారని విమర్శలు గుప్పించారు. జగన్కి ముందు చూపు లేని కారణంగా రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయ్యిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!