Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఆమె మండి నియోజక వర్గంలో ఎలాగో ఓడిపోతుందని.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండి నియోజకవర్గంలో అయితే రాష్ట్రానికి దిగుమతి చేయబడిన కంగానా రనౌత్ ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. మండిలో ప్రతి రోజు రాత్రి పగలు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు.
READ MORE: BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
కాగా.. గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగానా రనౌత్ వర్ష కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుందని పేర్కొన్నారు. కంగనా హిమాచల్ ప్రదేశ్ కు కేవలం టూర్ కోసమే వస్తారని విమర్శించారు. ఈ రోజు ఇక్కడ ఉంటారు. రేపు మళ్లీ వెళ్లిపోతారన్నారు. ఆమెకు బీజేపీ ఎంపీ సీటు ప్రకటించినప్పుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వేరు.. రాజకీయం వేరని.. రాజకీయం పరంగా ఆమెకు ఎటువంటి నాలెడ్జ్ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నేత కావాలా.. స్టార్ డమ్ నేతలు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి, సిమ్లా, కాంగ్రా, మహీపూర్లో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!