Congress: సాయంత్రం సీఈసీ భేటీ.. అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే స్థానాలు గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. దీంతో ఆమె రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. ఇక అమేథీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కూడా తర్జనభర్జన జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్ వేశారు. దీంతో అమేథీలో రాహుల్ పోటీపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు అమేథీ నుంచి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీలోకి దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
Also Read
- Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ఇదిలా ఉంటే వరుణ్గాంధీని రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగాలని బీజేపీ ప్రతిపాదించింది. ఇందుకు వరుణ్గాంధీ నిరాకరించారు. గతంలో ఆయన పిలిభిత్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించింది. తన సోదరిపై పోటీ చేసే ఉద్దేశం లేకనే ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఇక్కడ సోనియాగాంధీ నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. కానీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. తదుపరి పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. అమేథీలో మాత్రం మే 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!