Jai Bapu Jai Bhim Jai Constitution: నేటి నుంచి ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ప్రచారాన్ని ప్రారంభించనున్న కాంగ్రెస్
- శుక్రవారం నుండి ఢిల్లీలో మొదలు కానున్న
- 'జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం' కార్యక్రమం
- జనవరి 26, 2025న ముగియనున్న కార్యక్రమం.
Jai Bapu Jai Bhim Jai Constitution: కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది.
Also Read: Udayabhanu : విలన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి టాప్ యాంకర్
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా పార్టీ జనవరి 3కు ఈ ప్రచారాన్ని వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్కు గౌరవంగా పార్టీ అన్ని కార్యక్రమాలను వారం రోజుల పాటు నిలిపివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రచారంలో నియోజిక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
Also Read: Balakrishna Dabidi Dibide: సంవత్సరానికి సరిపడా ట్రోల్ మెటీరియల్.. ఏంట్రా ఇది?
కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని 13 నెలల పాటు కొనసాగించనుంది. జనవరి 26, 2025 నుండి జనవరి 26, 2026 వరకు “సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ పాదయాత్ర” పేరుతో భారీ ప్రచారాన్ని చేపట్టనుంది. అందులో కాంగ్రెస్ నాయకులు మొత్తం ప్రజలతో కలసి రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కృషి చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన మేరకు, రాహుల్ గాంధీ నేతృత్వంలో “సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ మార్చ్” జనవరి 3, 2025న ప్రారంభం కానుందని, ఇది “భారత్ జోడో యాత్ర” తరహాలో ఉంటుందని, దేశవ్యాప్తంగా రాజ్యాంగం విలువలను ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
-
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!