Jai Bapu Jai Bhim Jai Constitution: నేటి నుంచి ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ప్రచారాన్ని ప్రారంభించనున్న కాంగ్రెస్
- శుక్రవారం నుండి ఢిల్లీలో మొదలు కానున్న
- 'జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం' కార్యక్రమం
- జనవరి 26, 2025న ముగియనున్న కార్యక్రమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Bapu Jai Bhim Jai Constitution: కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది.
Also Read: Udayabhanu : విలన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి టాప్ యాంకర్
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా పార్టీ జనవరి 3కు ఈ ప్రచారాన్ని వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్కు గౌరవంగా పార్టీ అన్ని కార్యక్రమాలను వారం రోజుల పాటు నిలిపివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రచారంలో నియోజిక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
Also Read: Balakrishna Dabidi Dibide: సంవత్సరానికి సరిపడా ట్రోల్ మెటీరియల్.. ఏంట్రా ఇది?
కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని 13 నెలల పాటు కొనసాగించనుంది. జనవరి 26, 2025 నుండి జనవరి 26, 2026 వరకు “సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ పాదయాత్ర” పేరుతో భారీ ప్రచారాన్ని చేపట్టనుంది. అందులో కాంగ్రెస్ నాయకులు మొత్తం ప్రజలతో కలసి రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కృషి చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన మేరకు, రాహుల్ గాంధీ నేతృత్వంలో “సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ మార్చ్” జనవరి 3, 2025న ప్రారంభం కానుందని, ఇది “భారత్ జోడో యాత్ర” తరహాలో ఉంటుందని, దేశవ్యాప్తంగా రాజ్యాంగం విలువలను ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!