Kodanda Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది: కోదండ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Kisan Cell Leader Kodanda Reddy Heap Praise on CM Revath Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని కోదండ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన ఉందని చెప్పారు.
‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్ర నేతలు ప్రజల వద్దకు వెళ్లి విశ్వాసం కలిగించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది. 2017 అక్టోబరులో కేంద్రం, రాష్ట్రం కలిసి ముచ్చర్ల ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసింది. ప్రజాభిప్రాయ సేకరణలో 19,330 భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేకం చెప్పారు. ప్రభుత్వం వేల మంది పోలీసులు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు’ అని కోదండ రెడ్డి అన్నారు.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. కార్ల కలర్ మార్చాలని ఆదేశం
‘పేదలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా గత ప్రభుత్వం లాక్కుంది. ప్రజలకు వ్యతిరేకంగా పాలక పక్షాలు పనిచేసాయి. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. నిన్న సీఎం ఫార్మాసిటీ రద్దు చేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పారు. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు’ అని కోదండ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!