Shashi Tharoor: బీజేపీ-ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడంపై వివాదం.. దిగ్విజయ్ సింగ్కు శశి థరూర్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సీనియర్ నేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కొంత అసౌకర్యానికి గురి చేసినప్పటికీ, పార్టీలోని అనుభవజ్ఞులలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బయటపెట్టింది.
READ MORE: Inaya Sultana : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు.. ప్రతి రోజు నరకం చూశా: బిగ్బాస్ బ్యూటీ
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ఈ వివాదం మరింత ముదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పక్కన నేలపై కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో ఒక సాధారణ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయి పదవుల వరకు ఎదగగలడని రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన తాను ఆర్ఎస్ఎస్-బీజేపీలకు గట్టి ప్రత్యర్థినేనని వివరణ ఇచ్చినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. వరుస ఎన్నికల పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్లో ఈ వ్యాఖ్యలు చీలికలను బయటపెట్టాయి. అయితే, చాలా మంది నేతలు డిగ్విజయ సింగ్కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తాము సంఘ్ భావజాలానికి, అలాగే “గాంధీ హంతకుల” ఆలోచనలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల భేదాభిప్రాయాల కారణంగా తరచూ వార్తల్లో ఉండే శశి థరూర్ను మీడియా ప్రశ్నించింది. డిగ్విజయ సింగ్తో మాట్లాడారా? పార్టీ సంస్కరణలపై ఆయనకు మద్దతు ఇస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. “మేము స్నేహితులం. మాట్లాడుకోవడం సహజం. సంస్థను బలోపేతం చేయాలి – ఇందులో ఎలాంటి సందేహం లేదు.. మాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను సంస్థ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ చాలా అవసరం. అది సహజమైన విషయం. మన సంస్థలో క్రమశిక్షణ తప్పనిసరి.” అని థరూర్ అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!