Shashi Tharoor: బీజేపీ-ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడంపై వివాదం.. దిగ్విజయ్ సింగ్కు శశి థరూర్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సీనియర్ నేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కొంత అసౌకర్యానికి గురి చేసినప్పటికీ, పార్టీలోని అనుభవజ్ఞులలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బయటపెట్టింది.
READ MORE: Inaya Sultana : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు.. ప్రతి రోజు నరకం చూశా: బిగ్బాస్ బ్యూటీ
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఈ వివాదం మరింత ముదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పక్కన నేలపై కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో ఒక సాధారణ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయి పదవుల వరకు ఎదగగలడని రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన తాను ఆర్ఎస్ఎస్-బీజేపీలకు గట్టి ప్రత్యర్థినేనని వివరణ ఇచ్చినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. వరుస ఎన్నికల పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్లో ఈ వ్యాఖ్యలు చీలికలను బయటపెట్టాయి. అయితే, చాలా మంది నేతలు డిగ్విజయ సింగ్కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తాము సంఘ్ భావజాలానికి, అలాగే “గాంధీ హంతకుల” ఆలోచనలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల భేదాభిప్రాయాల కారణంగా తరచూ వార్తల్లో ఉండే శశి థరూర్ను మీడియా ప్రశ్నించింది. డిగ్విజయ సింగ్తో మాట్లాడారా? పార్టీ సంస్కరణలపై ఆయనకు మద్దతు ఇస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. “మేము స్నేహితులం. మాట్లాడుకోవడం సహజం. సంస్థను బలోపేతం చేయాలి – ఇందులో ఎలాంటి సందేహం లేదు.. మాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను సంస్థ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ చాలా అవసరం. అది సహజమైన విషయం. మన సంస్థలో క్రమశిక్షణ తప్పనిసరి.” అని థరూర్ అన్నారు.
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..