Shashi Tharoor: బీజేపీ-ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడంపై వివాదం.. దిగ్విజయ్ సింగ్కు శశి థరూర్ మద్దతు
Shashi Tharoor: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సీనియర్ నేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కొంత అసౌకర్యానికి గురి చేసినప్పటికీ, పార్టీలోని అనుభవజ్ఞులలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బయటపెట్టింది.
READ MORE: Inaya Sultana : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు.. ప్రతి రోజు నరకం చూశా: బిగ్బాస్ బ్యూటీ
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
ఈ వివాదం మరింత ముదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పక్కన నేలపై కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో ఒక సాధారణ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయి పదవుల వరకు ఎదగగలడని రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన తాను ఆర్ఎస్ఎస్-బీజేపీలకు గట్టి ప్రత్యర్థినేనని వివరణ ఇచ్చినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. వరుస ఎన్నికల పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్లో ఈ వ్యాఖ్యలు చీలికలను బయటపెట్టాయి. అయితే, చాలా మంది నేతలు డిగ్విజయ సింగ్కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తాము సంఘ్ భావజాలానికి, అలాగే “గాంధీ హంతకుల” ఆలోచనలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల భేదాభిప్రాయాల కారణంగా తరచూ వార్తల్లో ఉండే శశి థరూర్ను మీడియా ప్రశ్నించింది. డిగ్విజయ సింగ్తో మాట్లాడారా? పార్టీ సంస్కరణలపై ఆయనకు మద్దతు ఇస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. “మేము స్నేహితులం. మాట్లాడుకోవడం సహజం. సంస్థను బలోపేతం చేయాలి – ఇందులో ఎలాంటి సందేహం లేదు.. మాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను సంస్థ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ చాలా అవసరం. అది సహజమైన విషయం. మన సంస్థలో క్రమశిక్షణ తప్పనిసరి.” అని థరూర్ అన్నారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో