Shashi Tharoor: బీజేపీ-ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడంపై వివాదం.. దిగ్విజయ్ సింగ్కు శశి థరూర్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సీనియర్ నేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కొంత అసౌకర్యానికి గురి చేసినప్పటికీ, పార్టీలోని అనుభవజ్ఞులలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బయటపెట్టింది.
READ MORE: Inaya Sultana : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు.. ప్రతి రోజు నరకం చూశా: బిగ్బాస్ బ్యూటీ
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
ఈ వివాదం మరింత ముదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పక్కన నేలపై కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో ఒక సాధారణ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయి పదవుల వరకు ఎదగగలడని రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన తాను ఆర్ఎస్ఎస్-బీజేపీలకు గట్టి ప్రత్యర్థినేనని వివరణ ఇచ్చినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. వరుస ఎన్నికల పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్లో ఈ వ్యాఖ్యలు చీలికలను బయటపెట్టాయి. అయితే, చాలా మంది నేతలు డిగ్విజయ సింగ్కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ తాము సంఘ్ భావజాలానికి, అలాగే “గాంధీ హంతకుల” ఆలోచనలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల భేదాభిప్రాయాల కారణంగా తరచూ వార్తల్లో ఉండే శశి థరూర్ను మీడియా ప్రశ్నించింది. డిగ్విజయ సింగ్తో మాట్లాడారా? పార్టీ సంస్కరణలపై ఆయనకు మద్దతు ఇస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. “మేము స్నేహితులం. మాట్లాడుకోవడం సహజం. సంస్థను బలోపేతం చేయాలి – ఇందులో ఎలాంటి సందేహం లేదు.. మాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను సంస్థ బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ చాలా అవసరం. అది సహజమైన విషయం. మన సంస్థలో క్రమశిక్షణ తప్పనిసరి.” అని థరూర్ అన్నారు.
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!