Congress: ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసిన పలు కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ విచారణ జరిపినట్లు వెల్లడైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల తర్వాతే ఇన్ని కంపెనీలు ఎందుకు విరాళాలు ఇచ్చాయి? అలాంటి కంపెనీలపై ఎవరు ఒత్తిడి తెచ్చారు?” అని ఖర్గే ప్రశ్నించారు.
Read Also: Titanic 2 Ship: టైటానిక్ షిప్ను మించి టైటానిక్ 2.. ఎవరీ క్లైవ్ పామర్?
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
ఇప్పుడు రద్దు చేయబడిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 కంపెనీలలో 15 కంటే ఎక్కువ సంస్థలు దర్యాప్తు చేయబడ్డాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హల్దియా ఎనర్జీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, చెన్నై గ్రీన్వుడ్స్ వంటి కేంద్ర ఏజెన్సీలు విచారించిన సంస్థలలో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఐఎఫ్బీ ఆగ్రో లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్, దివీస్ లేబొరేటరీ లిమిటెడ్, యునైటెడ్ ఫాస్ఫరస్ ఇండియా లిమిటెడ్, అరబిందో ఫార్మాలు కూడా విచారించిన సంస్థలలో ఉన్నట్లు తెలిసింది. ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కొన్న వారు బీజేపీలోకి వెళ్లి అక్కడ (పార్టీ) పదవులు పొందారని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. బీజేపీలో వారు వెంటనే ‘క్లీన్’ అయ్యారని ఆయన ఆరోపించారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ, ప్రోబ్ ఏజెన్సీ దాడులకు, ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసే సంస్థలకు మధ్య సంబంధం అంచనాల ఆధారంగా ఉందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీకి దాదాపు 50 శాతం విరాళాలు లభించగా, కాంగ్రెస్కు 11 శాతం మాత్రమే వచ్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా చూపుతుందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీ ఐదేళ్లలో రూ.6,060 కోట్లను క్యాష్ చేసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో విడుదల చేసింది.కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా బీజేపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దాదాపు రూ.300 కోట్లు స్తంభించిపోయాయని, ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు. ‘‘ప్రత్యర్థి పార్టీ ఖాతా స్తంభింపజేస్తే ఎన్నికల్లో ఎలా పోరాడతారు?.. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఎక్కడుంది?” అని ఖర్గే ప్రశ్నించారు.
- Tags
- bjp
- CBI
- congress
- ED
- Electoral Bonds
తాజావార్తలు
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!