Congress- BJP Second Candidate List: లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్- బీజేపీ రెండో జాబితాపై కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress- BJP: లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల రెండో జాబితాను రెడీ చేస్తున్నాయి. బీజేపీ తన తొలి జాబితాలోనే 16 రాష్ట్రాలకు సంబంధించిన 195 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 90 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న (సోమవారం) ఢిల్లీలో రెండోసారి సమావేశం అయింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక, ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలోని లోక్సభ స్థానాల్లో పార్టీ తరఫున బరిలోకి దించాల్సిన అభ్యర్థుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు టాక్.
Read Also: PM Modi : రూ.1200కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ.. నేడు శంకుస్థాపన చేయనున్న మోడీ
Also Read
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Astrology: జూలై 4 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ఇక, ఈ సమావేశానికి ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత దుష్యంత్ చౌటాలా కలిసి ఆ రాష్ట్రంలోని సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించారు. అయితే, వాస్తవానికి హర్యానాలో జేజేపీతో పొత్తును పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ జేజేపీతోనే కలిసి వెళ్లాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే, మరోవైపు, పార్టీ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిన్న (సోమవారం) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు హాజరయ్యారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని 60కి పైగా స్థానాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. వీటిలో దాదాపు 40 మంది పేర్లను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
Read Also: Congress : కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!
అలాగే, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ను ఛింద్వాడా నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ ను ఆ రాష్ట్రంలోని జాలోర్ ఎంపీ స్థానంలో బరిలోకి దింపనున్నట్లు తెలుస్తుంది.. అయితే అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్లు ఈ దఫా లోక్సభకు పోటీ చేసే ఛాన్స్ లేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!