Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. అఖండ భారత సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, జాతీయత కోసం ఆయన చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం డ్యాం భద్రతపై జాతీయ డ్యాం భద్రతా సంస్థ (NDSA) హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ మరమ్మతులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
Also Read
- IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుని భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన రాంచందర్ రావు, ఆ అవినీతి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అవినీతిపై నామమాత్ర చర్యలతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.
మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారని, అయితే ఎంఐఎంకు చెందిన అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫాతిమా విద్యాసంస్థలలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులే కోర్టుకు తెలిపారని, హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఆక్రమణలు జరిగినట్లు అంగీకరించినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడం వెనుక కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ కారణమని రాంచందర్ రావు ఆరోపించారు. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేసి అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలని, హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎంకు చెందిన అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్, ఎంఐఎం, హైడ్రా వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేపడుతుందని రాంచందర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!