YSR Aasara scheme: వారికి గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రేపే ఖాతాల్లో సొమ్ము జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Aasara scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.. ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ పర్యటన కోసం.. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Ayodhya : అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన తేదీ వచ్చేసింది.. ప్రకటించిన ముస్లిం పక్షం
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
సీఎం జగన్ పర్యటనకు సంబంధిచిన వివరాల్లోకి వెళ్తే..
* 23న ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
* ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.30కు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు సీఎం జగన్.
* హెలిప్యాడ్ వద్ద ఉదయం 10.30 నుంచి 10.40 గంటల వరకు ప్రజాప్రతిధులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ఏపీ సీఎం.
* 10.40 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయల్దేరి 10.50 గంటలకు బహిరంగ సభావేదికకు చేరుకుంటారు..
* 10.55 నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* బహిరంగలో ఉపన్యాసం తర్వాత వైఎస్సార్ ఆసరా నాల్గో విడత కింద కంప్యూటర్ బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
* మధ్యాహ్నం 12.35 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.. సభ వేదిక నుంచి బయల్దేరి హెలిప్యాడ్ వద్దకు 12.45 గంటలకు చేరుకుంటారు. 1.45 గంటల వరకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడనున్నారు.
* మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30కు అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకోనున్న సీఎం జగన్.. రోడ్డు మార్గంలోని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!