CM YS Jagan: నేటి నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
Also read: Congress Final List: నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఆపై పొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ వద్ద రాత్రి శిబిరానికి ఆయన చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ లోనే రాత్రి జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రోజుకొక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరుపై ఆయన భిన్న అభిప్రాయాలు అడిగి తెలుసుకోబోతున్నారు.
Also read: Ram Charan : రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలను చూస్తే మైండ్ బ్లాకే..
ఇక ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రజల్లోకి వచ్చినా., పోలీసుల నుండి కాస్త తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ప్రజలతో మమేకం అవుతూ.. జనం కష్టాలు వింటూ పాదయాత్రలు, రోడ్ షోలు చేసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక జనానికి కాస్త దూరంగా ఉంరని చెప్పొచ్చు. దీనికి కారణం పోలీసుల ఆంక్షలతో అన్ని పర్యటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సాధారణ జనాన్ని దూరంగా ఉంచడంతో అభిమానుల్ని, కార్యకర్తల్ని కాస్త నిరాశకు గురి చేసేది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?