CM YS Jagan: నేటి నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
Also read: Congress Final List: నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా!
Also Read
ఆపై పొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ వద్ద రాత్రి శిబిరానికి ఆయన చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ లోనే రాత్రి జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రోజుకొక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరుపై ఆయన భిన్న అభిప్రాయాలు అడిగి తెలుసుకోబోతున్నారు.
Also read: Ram Charan : రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలను చూస్తే మైండ్ బ్లాకే..
ఇక ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రజల్లోకి వచ్చినా., పోలీసుల నుండి కాస్త తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ప్రజలతో మమేకం అవుతూ.. జనం కష్టాలు వింటూ పాదయాత్రలు, రోడ్ షోలు చేసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక జనానికి కాస్త దూరంగా ఉంరని చెప్పొచ్చు. దీనికి కారణం పోలీసుల ఆంక్షలతో అన్ని పర్యటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సాధారణ జనాన్ని దూరంగా ఉంచడంతో అభిమానుల్ని, కార్యకర్తల్ని కాస్త నిరాశకు గురి చేసేది.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!