Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Speech At Kadapa Roadshow

CM YS Jagan: ఇలాంటి వారా వైఎస్సార్‌ వారసులు..?

Published Date :May 10, 2024 , 7:18 pm
By Sudhakar Ravula
CM YS Jagan: ఇలాంటి వారా వైఎస్సార్‌ వారసులు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: వైయస్సార్ పేరు లేకుండా చేస్తున్న ఇలాంటి వారా? వైఎస్సార్‌ వారసులు? అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.. కడపలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్‌లో పెట్టిన పార్టీ.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ.. చార్జిషీట్ లో మనమే ఆ పేరు పెట్టించామట.. ఎంతటి దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా..? అని తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నది ఎన్నికలు మాత్రమే కాదు.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు… ఇంటింటికి అభివృద్ధి పేదవాడి భవిష్యత్తుకు భరోసా వస్తుంది.. చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవడమే.. చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే అని దుయ్యబట్టారు.

రంగురంగుల పేపర్లతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఇచ్చే మ్యానిఫెస్టోకు చమరిగీతం పాడాం.. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99శాతం అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. వైసీపీ రాకమునువు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చింది.. లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నిధులు జమ చేశాం.. గతంలో ఎప్పుడైనా చూసారా …? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.. 8వ తరగతి నుంచి పిల్లల చేతులలో ట్యాబ్‌లు.. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా బోధన మొదలవుతోంది… ఏ తల్లిదండ్రి తమ పిల్లల చదువులు కోసం అప్పులపాలు కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించాం అన్నారు. పేదవాడి భవిష్యత్తు కోసం ఏమి చేయాలని ఆలోచిస్తూ పథకాలు అమలు చేసాం… చంద్రబాబు రాజకీయాల్లో ఊసరవెల్లి రాజకీయాలు కనిపిస్తున్నాయి.. చంద్రబాబు ముదిరిపోయిన తొండ అని విమర్శించారు.

నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టిన వ్యక్తి చంద్రబాబు.. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ఎన్డీఏతో కొనసాగుతాడట.. ఆరు నూరైనా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్‌.. అయితే, ఈ విషయాన్ని చంద్రబాబు.. మోడీ ఎదుట ఇలా చెప్పగలరా? అని ప్రశ్నించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఎన్డీఏ చెబుతున్నా.. ఎందుకు చంద్రబాబు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నాడు…? నాలుగు శాతం రిజర్వేషన్లు మతం పరంగా ఇచ్చినవి కాదు..! వెనుకబాటు ప్రాతిపదికగా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినవి.. రాజకీయం కోసం మైనార్టీల జీవితాలతో చలగాట ఆడటం న్యాయమేనా..? అని నిలదీశారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ రిజర్వేషన్ల గురించి ఏ అంశాలలో అయిన మైనార్టీలకు అండగా ఉంటాం… నలుగురి మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా, నలుగురు ఎమ్మెల్యేలుగా, ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మహిళకు డిప్యూటీ శాసన మండలి చైర్మన్ ఇచ్చింది వైసీపీనే అన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తూ ఏడు మంది మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం అని గుర్తుచేశారు. నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు.. ఇదే కడప గడ్డ నుంచి ఇండిపెండెంట్‌గా 14 రోజుల్లో గుర్తు కూడా లేని సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది.. కడప నుంచి మీ బిడ్డకు 5 లక్షల 40 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు సీఎం జగన్‌.. నోట కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో ప్రజల జతకట్టాలా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • avinash reddy
  • CM YS Jagan
  • Kadapa Roadshow

తాజావార్తలు

  • AP Census 2027: ఏపీలో సెన్సస్ 2027కు శ్రీకారం.. రేపటి నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం.!

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!

  • Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

  • Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions