4 years of YSRCP Government Rule: జగన్ పాలనకు నాలుగేళ్లు.. 175 వైపు అడుగులు వేస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 years of YSRCP Government Rule: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తి అవుతుంది.. ఏకంగా151 అసెంబ్లీ స్థానాలను, 22 ఏంపీ సీట్లను సాధించిన విజయం కేతనం ఎగురవేసింది వైసీపీ.. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ఇచ్చారు జగన్.. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆ పార్టీ చేసిన క్యాంపెయిన్, ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలన అంటే ఏమిటో చూపిస్తామంటూ చేసిన ప్రచారం.. ఆ పార్టీ ఎంతగానో కలిసి వచ్చింది.. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ హామీని అమలు చేస్తున్నామని.. నాలుగేళ్ల పాలనలో ఏకంగా 98.4 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. అందుకే ప్రతీ గడపకు వెళ్లి.. ధైర్యంగా మేం చేసిన పనులను, అందించిన పథకాలను వివరిస్తున్నామని.. ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తోందని పేర్కొంటున్నారు.
కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కీలక రాజకీయ పదవులు కట్టబెట్టింది కూడా తమ ప్రభుత్వమే అంటున్నారు.. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేది మేమే.. కడప స్టీల్ ప్లాంట్ను, భోగాపురం ఎయిర్పోర్ట్నే కాదు.. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసేది మేమే అంటున్నారు.. గ్రామ, వార్డు సచివాలయాలు… జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలన వికేంద్రీకరమ జరుగుతోందని.. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు.. గతంలో జరిగిన అన్యాయం.. మళ్లీ జరగకూడదు.. పరిపాలన వికేంద్రీకరణ మా లక్ష్యం.. అందుకే మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేస్తున్నారు.. అయితే, వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకొని నాలుగేళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 హ్యాష్టాగ్ను ట్రెండ్ చేస్తున్నాయి ఆ పార్టీ శ్రేణులు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇక, నాలుగేళ్ల పాలనపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. ”దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం.. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం.” అని పేర్కొంటు.. #YSRCPAgain2024 హ్యాష్టాగ్ను జోడించి ట్వీట్చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!