Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Comments At Yemmiganur

CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది..!

Published Date :October 19, 2023 , 2:11 pm
By Sudhakar Ravula
CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఆలోచించాలి అని సూచించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన జగనన్న చేదోడు సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రభుత్వం వస్తుంది.. ఎవరికి లంచాలు ఇవ్వకుండా.. ఇలాంటి సహాయం అందుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరైనా అనుకున్నారా..? అని ప్రశ్నించారు. సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించాలన్నారు.. అప్పట్లో గజదొంగల ముఠా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. అప్పటికి ఇప్పటికి తేడా ఇదే అన్నారు. మంచి మనసుతో అండగా వుండే ప్రభుత్వం కావాలని పేదలు కోరుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబు పాలన చూస్తే కుప్పం ప్రజలు కూడా మా వాడు అని చెప్పే పరిస్థితి లేదన్నారు సీఎం వైఎస్ జగన్.. కుప్పంలో పేద వానికి ఇల్లు ఇవ్వని పరిస్థితి.. కుప్పంలో 20 వేల ఇళ్ల స్థలాలు మేమిచ్చాం అన్నారు. చంద్రబాబు హయాంలో 80 వేల కోట్లు రుణ మాఫీ చేస్తామని అమలు చేయలేదు.. వైసీపీ హయాంలో రైతుకు తోడుగా వుంటూ నడిపిస్తున్నాం అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేశారని తెలిపారు. వైసీపీ ఎన్నికల మానిఫెస్టోలో 99 శాతం నెరవేర్చాం అని స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలు మొదలు, రాజధాని భూముల స్కామ్, స్కిల్ స్కాం.. ఇలా చంద్రబాబు పాలన సాగిందని ఆరోపణలు గుప్పించారు. ఎక్కడా అవినీతి లేకుండా, లంచం ఇవ్వకుండా 2.38 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశాం.. టీడీపీ, వైసీపీ పాలన మధ్య తేడా గమనించండి అని విజ్ఞప్తి చేశారు.

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

చంద్రబాబు హయాంలో పొదుపు రుణాలు మాఫీ చేస్తామని సున్నా వడ్డీ కూడా తీసేశారిని విరుచుకుపడ్డారు సీఎం జగన్‌.. పొదువు మహిళలకు ఇచ్చిన మాట తప్పారని విమర్‌శించారు. కానీ, పొదువు సంఘాల ఎన్ పీ ఏ లు 18 శాతం నుంచి 0.03 శాతానికి తగించ గలిగాం అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేకపోయారు.. మా హయాంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం.. 22 లక్షల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి.. 2 లక్షల 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం అని వెల్లడించారు. మరవైపు.. ఆరోగ్యశ్రీ కింద గతంలో వెయ్యి వ్యాధులు కవర్ అయితే ఇప్పుడు 3 వేల వ్యాధులు కవర్ అవుతున్నాయని తెలిపారు.. రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం.. పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు సీఎం జగన్.. రాబోయేది క్లాస్ వార్.. కౌరవులు, తోడేళ్లు ఏకమవుతారు.. కానీ, మీ బిడ్డ నమ్ముకున్నది దేవుణ్ణి, మిమ్మల్ని మాత్రమే అన్నారు.. ఓటు వేసేటప్పుడు మీకు మంచి జరిగిందా.. లేదా కొలమానంగా తీసుకోండి.. మంచి జరిగివుంటే మీ బిడ్డకు మీరే సైనికునిగా నిలవండి అంటూ విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • yemmiganur
  • YSRCP

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions