Aaditya Thackeray: సీఎం షిండేను రాజీనామా చేయమని అడిగారు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను రాజీనామా చేయాలని కోరినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను రాజీనామా చేయమని కోరినట్లు నేను విన్నాను. ప్రభుత్వంలో కొన్ని మార్పులు ఉండవచ్చు” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘అత్యాశతో ఏడాది క్రితం మంత్రి పదవులు వదులుకున్న ఆ ద్రోహుల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి కుర్చీ ప్రమాదంలో పడింది. వరుసగా నాలుగు రోజులుగా శాఖల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రిని కూడా తొలగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని విన్నాను.’ అని ఆదిత్య ఠాకే చెప్పారు. మహావికాస్ అఘాడీ సమావేశంలో ప్రజలకు న్యాయం కోసం చట్టవిరుద్ధమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారన్నారు. ప్రభుత్వంలో కూర్చున్న వారు తమ స్వప్రయోజనాలలో మునిగిపోయారని.. వారు పార్టీని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే పని చేస్తున్నారని ఠాక్రే అన్నారు.
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
Also Read: Madhyapradesh: మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన.. కదిలే కారులో బలవంతంగా పాదాలు నాకించి..
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయ తిరుగుబాటు తర్వాత శుక్రవారం రాత్రి ముంబైలోని గార్వేర్ క్లబ్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రసంగించారు. ఎన్సీపీ నాయకులు చేరిన ప్రభుత్వంలో చేరిన తర్వాత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను శాంతింపజేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. “మేము పార్టీలను విచ్ఛిన్నం చేయము, అయితే ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతో ఎవరైనా మాతో చేరాలనుకుంటే, మేము వారిని స్వాగతించాలి” అని అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్, 9 మంది ఇతర పార్టీ నేతలతో కలిసి జూలై 2న మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అదే రోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!