Madhyapradesh: మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన.. కదిలే కారులో బలవంతంగా పాదాలు నాకించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాది బలవంతంగా అతడితో పాదాలు నాకించి వికృతంగా ప్రవర్తించారు. కదులుతున్న వాహనంలో ఓ వ్యక్తి పాదాలను మరో వ్యక్తి నాకుతున్నట్లు కనిపించిన వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
Also Read: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో నిందితులు బాధితుడి ముఖంపై పదేపదే కొట్టారు. నిందితులు మాటలతో దుర్భాషలాడారు. బాధితుడిని కదులుతున్న కారులో ‘గోలు గుర్జర్ తండ్రి’ అని చెప్పాలని బలవంతం చేశారు. ఓ వ్యక్తి చాలాసార్లు చెప్పుతో కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇద్దరు నిందితులు అతడితో బలవంతంగా తమ పాదాలను నాకించారు. ఈ తతంగాన్ని కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో కాస్తా వివాదాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులు అతడిపై ఎందుకు దాడి చేశారన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
Also Read: Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
శుక్రవారం సాయంత్రం వీడియో వైరల్గా మారిందని, దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని దబ్రా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) వివేక్ కుమార్ శర్మ తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోటియా దబ్రా ఈ వీడియోను ధ్రువీకరంచారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు నిబంధనల ప్రకారం కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్గా మారిన కొద్ది రోజులకే ఈ షాకింగ్ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను గురువారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!