CM Revanth Reddy: తక్షణ సాయం అందించాలి.. కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి
- వరద నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
- తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వివరించారు. రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని సీఎం తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
Read Also: Hyderabad Rain: హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
Also Read
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని సీఎం కోరారు. శాశ్వత పునరుద్ధరణ పనులకూ తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ సాయం అందించాలని సీఎం కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!