Site icon NTV Telugu

Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..

Revanth

Revanth

Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం బేగంపేట నుంచి హెలికాప్టర్​లో సిద్ధిపేటకు వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ దగ్గర HCCB – కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకోని.. మధ్యాహ్నం 2 గంటలకు కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ నగరానికి బయల్దేరనున్నారు. 3.30గంటలకు ఎన్టీఆర్​ మార్క్ లోని హెచ్​ఎండీఏ గ్రౌండ్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొంటారు.

Read Also: TTD Update: రేపు స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్స్ జారీ చేసిన టీటీడీ!

అలాగే, నేటి సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రజా పాలనా సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ (డిసెంబర్ 2) 206 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం అవుతాయి. ఇక, ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 442 సివిల్ అసిస్టెన్స్ సర్జెన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు సైతం పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను కూడా రేవంత్ రెడ్డి మంజూరు చేయనున్నారు.

Exit mobile version