CM Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- చంద్ర గ్రహణం పోయింది
- మంచి రోజులు వచ్చాయి
- ఇందిరా గాంధీని అమ్మ అన్నారు
- ఇప్పుడు నన్ను అన్నా అంటున్నారు
- మిమ్మల్ని కోటీశ్వరుల చేసే బాధ్యత తీసుకుంటా
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్.. కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. ఇవాళ..సీతక్క… సురేఖ మంత్రులు అయ్యారన్నారు. 33 శాతం మహిళలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. మీలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపిస్తామన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
“ప్రతి మండలం లో రైస్ మిల్లులు. అవసరం మేర గోడౌన్లు నిర్మిస్తాం. గత పాలకులు వడ్లు ఇస్తే… బియ్యం పంది కొక్కుల లెక్క మెక్కారు. ఇకపై అలా ఉండదు.. రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు ఇస్తాం. చంద్ర గ్రహణం పోయింది. మంచి రోజులు వచ్చాయి. ఇందిరా గాంధీని అమ్మ అన్నారు. తర్వాత ఎన్టీఆర్ ను అన్నా అన్నారు. ఇప్పుడు రేవంత్ అన్న అని నన్ను అంటున్నారు అన్న.. అంటే మీ కుటుంబ సభ్యుడినే కదా. మిమ్మల్ని కోటీశ్వరుల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మహిళా సంఘాలు ఉత్పత్తులకు టాక్స్లు కూడా లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు టన్నెల్ కూలితే సంతోష పడుతున్నారు. పంట ఎండిపోతుంటే సంతోష పడుతున్నారు. నన్ను తిట్టడానికి ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇది పైశాచిక ఆనందం కాదా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సూచన చేయాలి. పైశాచిక ఆనందం పొందిన వాణ్ణి.. బాగుపడ్డట్టు చరిత్ర లో జరగలేదు. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం 28 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు చెక్కును అందజేశారు.
READ MORE: Hyderabad: అడ్డుగా ఉన్నారని.. ప్రియురాలి తల్లి, అక్కను కిరాతకంగా చంపిన ప్రియుడు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!