CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
- రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేసింది..
- హైడ్రా అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..
- ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ..
- హైడ్రా అంటే పేదల ఇళ్లను కూల్చుతుందని కొంతమంది చిత్రీకరిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ లోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, హైడ్రా ఏర్పాటు పట్ల తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇది కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన హైడ్రా అధికారులను మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే, దేశ ప్రజలు ఆమోదించిన రాజ్యాంగంలో ఇప్పటివరకు 100కి పైగా సవరణలు చేశామని, ఇది దేశ పరిపాలనలో అవసరమైన మార్పులను సూచించే సంకేతమని అయన అన్నారు. చాలా ముఖ్యమంత్రులు గతంలో సవరణలు చేసి, చట్టాలు రూపొందించారని.. అదే ధోరణిలో ప్రభుత్వ వ్యవస్థల్లో సమన్వయం అవసరమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Asaduddin Owaisi: ‘జిహాద్’ పేరుతో హత్య చేయాలనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు.!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక హైదరాబాద్ నగర నిర్మాణం గురించి మాట్లాడుతూ.. నిజాం పాలనలో వరదలు రావడంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో జంట జలాశయాలు నిర్మించారని, నిజాం పాలనలో ఏర్పడిన గొప్ప నిర్మాణాలు నేటికీ నిలిచివున్నాయన్నారు. కానీ, మనం ఇప్పుడు పాతదాన్ని వదిలేసి కొత్త ప్రాంతాల వైపు వెళ్తున్నామని.. “ఓల్డ్ సిటీ అంటే.. ఒరిజినల్ సిటీ” అని, దానిపై మనం బాధ్యత వహించాలని అన్నారు. అలాగే హైడ్రా గురించి అపోహలు పెంచుతున్న కొందరిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా అంటే కేవలం కూల్చడమే కాదు. అది ఆస్తుల రక్షణ, విపత్తుల సమయంలో స్పందించే ఒక వ్యవస్థ” అని అన్నారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు ప్రవహించి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పట్లో వారికి రూ. 10వేలు ఇచ్చారు.. కానీ, వారి ఆస్తులు లక్షల్లో కోల్పోయారు.. ఇది మన దౌర్భాగ్యం అని అన్నారు.
అలాగే చెరువులు, నాలాల కబ్జా గురించి మాట్లాడుతూ.. నగరంలోని చెరువులు, నాలాలు పూర్తిగా ఆక్రమించబడ్డాయి. ‘లేక్ వ్యూ’ పేరుతో చెరువుల్లో ఇళ్లు కడుతున్నారు. ఇటువంటి ఆక్రమణలే వరదలకు కారణం అవుతున్నాయని అన్నారు. “మూసీ నది మనకు వరం” అని వ్యాఖ్యానించిన సీఎం, సబర్మతి, యమునాలను పునరుద్ధరించినట్లే, మూసీ నదిని కూడా పునరుద్ధరించుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. ప్రకృతి పరిరక్షణకు హైడ్రా అవసరం అని అన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం.. 400 ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటే, అది ప్రకృతిని దెబ్బతీయడమంటున్నారు. కానీ, నిజంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావాలంటే ప్రకృతిని పరిరక్షించాల్సిందే అన్నారు చివరిగా హైడ్రా మీద నిందలు మోపుతున్న వారిని పట్టించుకోనని స్పష్టం చేసిన సీఎం, ప్రకృతి మీద మన బాధ్యతను గుర్తించి, సమన్వయం ఉన్న పరిపాలన ద్వారా ప్రజలకు సేవ చేయడమే హైడ్రా లక్ష్యం అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!