ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే… అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం ఆరు కేబినెట్ బెర్త్లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టిపెట్టారు. హైకమాండ్కు నలుగురి పేర్లతో సీఎం రేవంత్లిస్టు ఇవ్వగా.. మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురి పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు.