CM Revanth Reddy : ఇంకో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నామని, సివిల్స్ విద్యార్థులకు అతస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొందరికి లక్ష ఎక్కువ కావచ్చు అని, కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం మాది అని, చాలా కాలం సచివాలయం లేదని, సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేదన్నారు. అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించామని, ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Chiranjeevi: అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
అంతేకాకుండా..’మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ లుగా ఎందుకు ఎంపిక కాకూడదు అని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పరీక్షల మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు పరిమితం అవుతుంది. పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లంతా .. వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు. విద్యార్దులకు.. కంపనీ లకు గ్యాప్ కనిపిస్తుంది. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. వచ్చే ఏడాది నుండి స్పోర్ట్స్ యూనివర్సిటీ. గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ పదేళ్లుగా నిరుపయోగంగా మారింది. ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఏడాది బడ్జెట్ లో ఐదు వేల కోట్లు పెట్టాం.. 100 నియోజక వర్గాల్లో కట్టబోతున్నం. పది పదిహేను రోజుల్లో vc ల నియామకం. గతంలో పరీక్షలు పెట్టాలి అని ఆందోళన జరిగేది. ఇప్పుడు మేము పరీక్ష పెడుతుంటే..కొందరు వద్దు అని ఆందోళన చేయిస్తున్నారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో ఇలాగే రెచ్చగొట్టి విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ త్యాగం మీద రాజకీయం చేశారు. వాళ్ళ ఉద్యోగాలు పొగానే మళ్ళీ విద్యార్థుల రెచ్చగొడుతున్నారు. విద్యార్దులు ఎందుకు.. బావ బమ్మార్డులు దుక్కలెక్క ఉన్నారు.. మీరు దీక్షలు చేయండి అని నేను చెప్పిన. విద్యార్దులు కుట్ర లకు లొంగ కండి. సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. మా ప్రాధాన్యత రైతులు..విశ్వ విద్యాలయం .. ఉద్యోగాలు. గత పాలకులకు ప్రాధాన్యత ఇది కాదు.. భవనాలు…ఆస్తులు వారి ప్రాధాన్యత.. నల్గొండ జిల్లాలో ఎస్సైల ఎంపిక ఎక్కువ ఉంటుంది. 30 ఏండ్లు నుండి అక్కడ పోటీ ఎక్కువ. ప్రతి గ్రామంలో పోటీ పెరిగి si లు అవుతున్నారు. సివిల్స్ కూడా అలాగే పోటీ పడాలి.
మెయిన్స్ కి వెళ్ళాలి.. మీకు ఏ సమస్య వస్తె.. మీకు అన్నగా నేను అండగా ఉంట’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
- CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
- Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్కు కౌంట్డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
తాజావార్తలు
-
Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
-
CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
-
Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
-
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!