CM KCR : నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిద్ధిపేటలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అందరూ ఈ సభకే వచ్చారా అని అన్నారు. లెక్కపెట్టలేనంత మంది వచ్చారని, జనని జన్మ భూమిచ్చా స్వర్గదపి గరీయసి.. సిద్దిపేట పేరు విన్న, చూసిన నాకు కలిగే భవన ఇది అని ఆయన అన్నారు. నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డేనని, నన్ను ఇంత వాడిని చేసినా నా మాతృభూమికి నమస్కారమన్నారు కేసీఆర్.
అంతేకాకుండా.. ‘ఈ గడ్డ రుణం నేము ఏమిచ్చినా తీర్చుకోలేను. తన పాత మిత్రులను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ అమలు అవుతున్నది అంటే సిద్దిపేట వేదికగా నేను పెట్టిన పథకమే. చింతమడకలో నేను చిన్న వాణ్ణి ఉన్నప్పుడు నాకు తాగడానికి పాలు లేకపోతే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది. ఆనాడు సాగు నీళ్లు లేని సిద్దిపేటకి మొండి ధైర్యంతో మీ దివేనలతో ముందుకు వెళ్లిన. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే. నేను ఎక్కడికి పోయినా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని మొక్కి పోతా. సిద్దిపేట ఎలా అభివృద్ధి జరిగిందో చెబితే హరీష్ రావుని పొగిడినట్టు అవుతుంది. నేను ఉప ఎన్నిక కోసం కరీంనగర్ వెళ్తే ఆరడుగుల బులెట్ హరీష్ రావుని మీకు ఇచ్చి పోయిన. హరీష్ రావు మీద మన మంత్రులు జోక్ వేస్తారు.
Also Read
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ఏడన్న ఏమైనా కనిపిస్తే అది సిద్దిపేట లో పెట్టుకుంటాడు. సిద్దిపేట లో నేను ఉన్న హరీశ్ రావు చేసినంత అభివృద్ధి నేను చేయకపోదును. సిద్దిపేట కి ఒక్కటే తక్కువ ఉన్నది అది విమానం రావడమే. సిద్దిపేటలో లేనిదంటూ ఏమి లేదు. సిద్దిపేటకి పట్టుబట్టి హరీష్ రావు ఐటీ హబ్ తెచ్చాడు. తెలంగాణలోనే సిద్దిపేట కి ప్రత్యేక గౌరవం ఇచ్చారు. హరీష్ ని లక్ష మెజారిటీతో గెలిపించారు. ఈ సారి కూడా హరీష్ కే ఎక్కువ మెజారిటీ రావాలి. దళిత బంధు పథకానికి ప్రేరణ నాకు సిద్దిపేట లో జరిగిన ఘటనే ఉదాహరణ. ఈ దిక్కుమాలిన దరిద్రపు కాంగ్రెస్ దళితుల కోసం ఏమి చేయలేదు. దళితులకు విడతల వారిగా న్యాయం చేస్తాం. తెలంగాణ భారతదేశానికి తలమానికం అయితే సిద్దిపేట మాత్రం యావత్తు తెలంగాణకే తలమానికం. హరీష్ రావు బాగా పని చేస్తున్నాడు. మాల్లోక్కసారి హరీష్ రావుని మెజారిటీ దాటిపించి గెలిపించాలి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!