CM KCR : దళితబంధు పుట్టించిన మొగోడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూసుకువెళ్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఖమ్మం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా అశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లిలో వెంకట వీరయ్య 70, 80 వేల మెజారిటీ తో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మీద నుంచి చూశా… ఇంకా రావాల్సిన వారు చాలా మంది… సండ్ర మీద అభిమానం తో వచ్చారన్నారు. సత్తుపల్లి చైతన్యం, ఆలోచన వున్న ప్రాంతమన్నారు. పోటీ చేసిన వ్యక్తులు అనుభవం, కార్యదక్షత చూడాలన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా.. ‘పార్టీ ఎది, పార్టీ చరిత్ర, వైఖరి, ప్రజల గురించి ఆ పార్టీ ఏమి ఆలోచిస్తుంది అనేది చూడాలి. కులాన్ని ద్వేషించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి పరిణతి వచ్చిన దేశంలో అద్భుతాలు జరుగుతాయి. దళిత బంధు పుట్టించిన మొగుడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు బందు వుందా. ఎవ్వరూ దరఖాస్తు ఇవ్వకున్న డిమాండ్ చేయకుండా నేను ఇచ్చాను. ఓట్ల కోసం పెట్టలేదు. 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వస్తె వారి పరిస్థితి బాగాలేదు. అంటరాని వారు గా ఇబ్బందులు పడ్డారు. పేద పెడబొబ్బలు పెట్టే మూడు రంగులు, ఎర్ర రంగు జెండాలు దళితులను వాడుకున్నారు. ఎన్నికల్లో మోసాలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఆనాడే దళిత చైతన్య యాత్ర పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టని పథకాలు చాలా పెట్టాను. ఎన్నిక గడువాలి అన్న ఆలోచన మాకు లేదు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. కరోనా దరిద్రం, నోట్లు రద్దు లేకపోతే ముందే దళిత బందు పెట్టాను.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
భట్టి నియోజకవర్గం లో పెట్టాను. మా ఎమ్మెల్యే కే పేరు రావాల్నేది మాకు లేదు స్వార్థ రాజకీయాల చేసే వారిని కాదు. ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం లో పెట్టాను… ఎన్నికల నోటిఫికేషన్ నెల ముందే వచ్చింది. దుర్మార్గులు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. బల్పు రాజకీయాలు చేసిన నేతలకు సీత రామ ప్రాజెక్ట్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆరునూరైనా ప్రభుత్వం మే వస్తోంది. అసెంబ్లీ వాకిలి తోక్కనివ్వను అంటున్నాడు ఒక్కరూ..
ఖమ్మం పహిల్వాన్ గా అసెంబ్లీలో సండ్ర, ఎంపీగా నామా అడుగుపెడుతాడు. నేను కూడా అంత అహంకారంతో మాట్లాడలేదు. ఇంత డబ్బు అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!