CM KCR : దళితబంధు పుట్టించిన మొగోడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూసుకువెళ్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఖమ్మం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా అశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లిలో వెంకట వీరయ్య 70, 80 వేల మెజారిటీ తో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మీద నుంచి చూశా… ఇంకా రావాల్సిన వారు చాలా మంది… సండ్ర మీద అభిమానం తో వచ్చారన్నారు. సత్తుపల్లి చైతన్యం, ఆలోచన వున్న ప్రాంతమన్నారు. పోటీ చేసిన వ్యక్తులు అనుభవం, కార్యదక్షత చూడాలన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా.. ‘పార్టీ ఎది, పార్టీ చరిత్ర, వైఖరి, ప్రజల గురించి ఆ పార్టీ ఏమి ఆలోచిస్తుంది అనేది చూడాలి. కులాన్ని ద్వేషించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి పరిణతి వచ్చిన దేశంలో అద్భుతాలు జరుగుతాయి. దళిత బంధు పుట్టించిన మొగుడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు బందు వుందా. ఎవ్వరూ దరఖాస్తు ఇవ్వకున్న డిమాండ్ చేయకుండా నేను ఇచ్చాను. ఓట్ల కోసం పెట్టలేదు. 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వస్తె వారి పరిస్థితి బాగాలేదు. అంటరాని వారు గా ఇబ్బందులు పడ్డారు. పేద పెడబొబ్బలు పెట్టే మూడు రంగులు, ఎర్ర రంగు జెండాలు దళితులను వాడుకున్నారు. ఎన్నికల్లో మోసాలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఆనాడే దళిత చైతన్య యాత్ర పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టని పథకాలు చాలా పెట్టాను. ఎన్నిక గడువాలి అన్న ఆలోచన మాకు లేదు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. కరోనా దరిద్రం, నోట్లు రద్దు లేకపోతే ముందే దళిత బందు పెట్టాను.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
భట్టి నియోజకవర్గం లో పెట్టాను. మా ఎమ్మెల్యే కే పేరు రావాల్నేది మాకు లేదు స్వార్థ రాజకీయాల చేసే వారిని కాదు. ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం లో పెట్టాను… ఎన్నికల నోటిఫికేషన్ నెల ముందే వచ్చింది. దుర్మార్గులు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. బల్పు రాజకీయాలు చేసిన నేతలకు సీత రామ ప్రాజెక్ట్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆరునూరైనా ప్రభుత్వం మే వస్తోంది. అసెంబ్లీ వాకిలి తోక్కనివ్వను అంటున్నాడు ఒక్కరూ..
ఖమ్మం పహిల్వాన్ గా అసెంబ్లీలో సండ్ర, ఎంపీగా నామా అడుగుపెడుతాడు. నేను కూడా అంత అహంకారంతో మాట్లాడలేదు. ఇంత డబ్బు అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!