CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి ప్రతిరోజూ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ముఖ్యమంత్రికి వివరించారు. దేశం గర్వించేలా నిర్మించిన అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఉద్యోగులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని ప్రారంభించి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల లభ్యతపై సీఎస్ శాంతకుమారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
సచివాలయం పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల అధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాలను ఒకే చోట ఏకీకృతం చేయడంపై సీఎం చర్చించారు. హెచ్ఓడీ అధికారులు తరచూ సచివాలయంలో పని చేస్తున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను సచివాలయానికి సమీపంలోనే ఒకేచోట నిర్మించాలని సీఎం నిర్ణయించారు. అన్ని రంగాల ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలు, వారి కింద పనిచేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య తదితర అంశాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి అందుబాటులో ఉన్న విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయని సీఎం ప్రశ్నించారు. స్థల నిర్ధారణ అనంతరం హెచ్ఓడీలందరూ ఒకేచోట ఉండేలా ట్విన్టవర్ల నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారు.
Read Also:MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!