CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి ప్రతిరోజూ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ముఖ్యమంత్రికి వివరించారు. దేశం గర్వించేలా నిర్మించిన అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఉద్యోగులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని ప్రారంభించి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల లభ్యతపై సీఎస్ శాంతకుమారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..
Also Read
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
సచివాలయం పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల అధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాలను ఒకే చోట ఏకీకృతం చేయడంపై సీఎం చర్చించారు. హెచ్ఓడీ అధికారులు తరచూ సచివాలయంలో పని చేస్తున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను సచివాలయానికి సమీపంలోనే ఒకేచోట నిర్మించాలని సీఎం నిర్ణయించారు. అన్ని రంగాల ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలు, వారి కింద పనిచేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య తదితర అంశాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి అందుబాటులో ఉన్న విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయని సీఎం ప్రశ్నించారు. స్థల నిర్ధారణ అనంతరం హెచ్ఓడీలందరూ ఒకేచోట ఉండేలా ట్విన్టవర్ల నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారు.
Read Also:MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!