CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. మహిళను చంపిన రెస్టారెంట్ యజమాని
Also Read
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
మరోవైపు.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడని సీఎం జగన్ ఆరోపించారు. కురుక్షేత్ర సంగ్రామానికి 36 గంటలు మాత్రమే సమయం ఉందని.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక కోసం మాత్రమే ఈ ఎన్నికలు కాదన్నారు. జగన్ కి ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు ఉంటాయని.. కూటమికి ఓటు వేస్తే పధకాలు ముగింపు అవుతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన రికమేండేషన్ తో 57 నెలలు కే మీ బిడ్డ గొంతు నొక్కేశారని సీఎం జగన్ తెలిపారు. 60 నెలలు మీ బిడ్డకి అధికారము ఇచ్చారు.. మీ కోసం నొక్కిన బటన్ పథకాలు కూడా ఆపేశారని ఆరోపించారు. నా గొంతు కాదు… మీ గొంతు నొక్కుతున్నారని ప్రజలనుద్దేశించి అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం గుర్తుందా? అని ప్రశ్నించారు. 2014 లో ఇచ్చిన ఒక్క హామీ అయిన చంద్రబాబు నేరవేర్చడా?.. ఇలాంటి హామీలు నమ్ముతారా? ఆలోచన చేయండని ప్రజలను కోరారు. కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది అని అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ కి రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!