CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. మహిళను చంపిన రెస్టారెంట్ యజమాని
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
మరోవైపు.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడని సీఎం జగన్ ఆరోపించారు. కురుక్షేత్ర సంగ్రామానికి 36 గంటలు మాత్రమే సమయం ఉందని.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక కోసం మాత్రమే ఈ ఎన్నికలు కాదన్నారు. జగన్ కి ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు ఉంటాయని.. కూటమికి ఓటు వేస్తే పధకాలు ముగింపు అవుతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన రికమేండేషన్ తో 57 నెలలు కే మీ బిడ్డ గొంతు నొక్కేశారని సీఎం జగన్ తెలిపారు. 60 నెలలు మీ బిడ్డకి అధికారము ఇచ్చారు.. మీ కోసం నొక్కిన బటన్ పథకాలు కూడా ఆపేశారని ఆరోపించారు. నా గొంతు కాదు… మీ గొంతు నొక్కుతున్నారని ప్రజలనుద్దేశించి అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం గుర్తుందా? అని ప్రశ్నించారు. 2014 లో ఇచ్చిన ఒక్క హామీ అయిన చంద్రబాబు నేరవేర్చడా?.. ఇలాంటి హామీలు నమ్ముతారా? ఆలోచన చేయండని ప్రజలను కోరారు. కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది అని అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ కి రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!