CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. మహిళను చంపిన రెస్టారెంట్ యజమాని
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
మరోవైపు.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడని సీఎం జగన్ ఆరోపించారు. కురుక్షేత్ర సంగ్రామానికి 36 గంటలు మాత్రమే సమయం ఉందని.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక కోసం మాత్రమే ఈ ఎన్నికలు కాదన్నారు. జగన్ కి ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు ఉంటాయని.. కూటమికి ఓటు వేస్తే పధకాలు ముగింపు అవుతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు
ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన రికమేండేషన్ తో 57 నెలలు కే మీ బిడ్డ గొంతు నొక్కేశారని సీఎం జగన్ తెలిపారు. 60 నెలలు మీ బిడ్డకి అధికారము ఇచ్చారు.. మీ కోసం నొక్కిన బటన్ పథకాలు కూడా ఆపేశారని ఆరోపించారు. నా గొంతు కాదు… మీ గొంతు నొక్కుతున్నారని ప్రజలనుద్దేశించి అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం గుర్తుందా? అని ప్రశ్నించారు. 2014 లో ఇచ్చిన ఒక్క హామీ అయిన చంద్రబాబు నేరవేర్చడా?.. ఇలాంటి హామీలు నమ్ముతారా? ఆలోచన చేయండని ప్రజలను కోరారు. కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది అని అన్నారు. తుప్పు పట్టిన సైకిల్ కి రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!