IPS Anjani Kumar : తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీగా అంజనీకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Anjani Kumar : తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అంజనీ కుమార్ను ఇన్ చార్జ్ డీజీపీగా నియమించడంతో కొంత మంది కీలక అధికారుల్ని బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా రవిగుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ను నియమించారు. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, లా అండ్ ఆర్డర్ డీజీగా శాంతికుమార్ జైన్ ను నియమించారు.
Read Also: CS Somesh Kumar: ఢిల్లీలో తెలంగాణ సీఎస్.. పెండింగ్ నిధుల చెల్లింపుపై కేంద్ర కార్యదర్శులతో మీటింగ్
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
అంజనీకుమార్ పూర్తి స్థాయి డీజీపీ నియామకం చేపట్టాలంటే తన సీనియర్లను దాటాలి. ఆయన కంటే సీనియారిటీ ప్రాతిపదికన ఐదుగురు ఉన్నతాధికారుల పేర్లతో జాబితా ఇప్పటికే యూపీఎస్సీకి చేరింది. వారిలో ముగ్గురిని రాష్ట్రానికి యూపీఎస్సీ సిఫార్సు చేయనుంది. వారిలో ఒకరిని తెలంగాణ సర్కార్ ఎంచుకుంటుంది. 1990 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనీ కుమార్, 1989 బ్యాచ్కు చెందిన హోంశాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ రవిగుప్తా , 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ జితేందర్, రాజీవ్ రతన్ పేర్లను యూపీఎస్సీకి పంపారు. యూపీఎస్సీ నుంచి షార్ట్ లిస్ట్ అయిన మూడు పేర్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీజీపీని నియమిస్తారు. అయితే అంజనీకుమార్ నే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ క్యాడర్కు చెందిన అంజనీకుమార్ స్వస్థలం బీహార్.
Read Also: Police Rules For 31St Night : న్యూ ఇయర్ మజా చేయ్.. కానీ రూల్స్ బ్రేక్ చేస్తే..
మరోవైపు పదవీ విరమణ చేయనున్న మహేందర్ రెడ్డికి మరో పోస్టు ఇచ్చేందుకు టీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి ఉన్నవారికి కేబినెట్ హోదా లభించనుంది. మహేందర్ రెడ్డి రిటైరైన తర్వాత ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..