AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?
- 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు
- ఎస్జీటీలు పోస్టులు 6371
- పీఈటీ పోటస్లు 132
- స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7725
- టీజీటీ పోస్టులు 1781
- పీజీటీ పోస్టులు 286
- ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టిసారించారు.. అందులో భాగంగా వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్పై సతకం.. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్పై సంతకం.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మెగా డీఎస్సీ కీలకంగా మారింది.. ఒకే సారి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్..
Read Also: Jammu-Kashmir Terror Attack :’పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించండి’.. మోడీ సూచన
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఇక, సీఎం చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేయగా.. ఆ మెగా డీఎస్సీ ద్వారా ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్న విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వం.. 16,347 పోస్టుల మెగా డీఎస్సీ ద్వారా.. ఎస్జీటీలు పోస్టులు 6,371.. పీఈటీ పోటస్లు 132, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. కాగా, ఈ ఏడాది ఆదిలోనే వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవటంతో కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీంతో డీఎస్సీ షెడ్యూల్ వాయిదా పడింది. వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించారు.. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించింది. వీటికి సంబందించి ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. డీఎస్సీతో పాటు టెట్ ఫలితాల విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఇక, మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన నేపథ్యంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!