Jammu-Kashmir Terror Attack :’పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించండి’.. మోడీ సూచన
- జమ్మూ కాశ్మీర్లో ముగిసిన సమీక్షా సమావేశం
- హోంమంత్రి అమిత్ షా..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడిన ప్రధాని
- ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై చర్చ
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోడీ మాట్లాడారు. కేంద్రపాలిత ప్రాంతంలో శాంతిభద్రతలు, సాయుధ బలగాలు చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రధానికి పూర్తి సమాచారం అందించారు. సాయుధ బలగాల తీవ్రవాద నిరోధక సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధాని అధికారులకు సూచించారు. భారీ భద్రతా దళాలను మోహరించాలని తెలిపారు. భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధాని అమిత్ షాతో చర్చించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా తెలిపారు. గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడిన ప్రధాని, కేంద్ర పాలిత ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. స్థానిక యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను మనోజ్ సిన్హా ప్రధానికి తెలియజేశారు.
READ MORE: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో తాజా ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో ఒక సైనికుడు గాయపడ్డాడు. గత నాలుగు రోజుల్లో దోడాలో ఇది రెండవ దాడి. కేంద్రపాలిత ప్రాంతంలో నాలుగో దాడి. జూన్ 9న రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు. ఒక రోజు ముందు, దక్షిణాదిలోని కతువా ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కాగా.. దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని, సవాళ్లతో కూడిన భూభాగంలో వారిని మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొండ జిల్లాలోని భదర్వా-పఠాన్కోట్ రహదారిలోని చత్తర్గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు మంగళవారం రాత్రి దాడి చేయడంతో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముట్టడిని పటిష్టం చేసేందుకు అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు. దోడాలో గత 24 గంటల్లో ఇది రెండో ఉగ్రవాద ఘటన కాగా, మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో నాలుగో ఉగ్రవాద ఘటన.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!