CM Chandrababu: అమరావతిలో భారత్ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ప్రపంచ క్వాంటం దినోత్సవం (World Quantum Day)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి (Amaravati)లో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (Quantum Reference Facility)ని ప్రారంభించారు. దీంతో అమరావతి క్వాంటం టెక్నాలజీ (Quantum Technology) అభివృద్ధిలో కీలక కేంద్రంగా మారనుంది.
Nitish Kumar: ముగిసిన నితీష్ కుమార్ శకం.. సీఎం పదవికి రాజీనామా..
Also Read
- Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
- Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
ఈ సందర్భంగా SRM యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ (Open Access Quantum Facility)తో పాటు, మేధా టవర్స్ (Medha Towers)లోని 1Q క్వాంటం ఫెసిలిటీ (1Q Quantum Facility)ని సీఎం ఆవిష్కరించారు. ఈ రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ (Quantum Test Beds) ద్వారా క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) ఉపకరణాలను పరీక్షించే (Testing), ధృవీకరించే (Certification) సామర్థ్యం రాష్ట్రానికి లభించింది.
ఈ ఫెసిలిటీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి -273 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేసే విధంగా రూపొందించబడ్డాయి. ఈ స్థాయి సాంకేతికతతో క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ (Quantum Computer Hardware) పనితీరును పరీక్షించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. దీంతో అమరావతి “క్వాంటం వ్యాలీ” (Quantum Valley)గా ఎదగడానికి బలమైన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం ఉపకరణాల తయారీ కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలగనుంది. ఇది పరిశోధన, ఇన్నోవేషన్లకు కీలక వేదికగా మారనుంది.
ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు, వివిధ క్వాంటం టెక్నాలజీ సంస్థల నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు (Scientists) హాజరయ్యారు. దేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!