CM Chandrababu: రామరాజ్యం తేవడమే నా ఆకాంక్ష
- సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగింది
- పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారు
- తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు
- రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాం
- వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లోనే జరగాలని కోరుకున్నాం
- ఒంటిమిట్టలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. “తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లోనే జరగాలని కోరుకున్నాం.. ఒకే శిలా పై సీతారాముల తో పాటు లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. తిరుపతి నుంచి ఒంటిమిట్ట వచ్చే సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలి. కొండలపై ఆయుర్వేద మొక్కలు నాటాలి. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం. దేవాలయాలు లేకుంటే కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థ లేదు.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
READ MORE: Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
రామరాజ్యం తేవడమే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీరాముని సాక్షిగా రాష్ట్రం ప్రతిఒక్కరికి న్యాయం చేస్తానని.. భారత దేశం ప్రధాని నాయకత్వం లో రామరాజ్యం గా అభివృద్ధి చెందుతుందన్నారు. రామరాజ్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీరాముని స్ఫూర్తి గా తీసుకుని ప్రతిఒక్కరు పేదల కు అండగా నిలవాలని.. సాటి మానవుడు కూడా బాగుండాలని అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.. రాత్రికి ఒంటిమిట్ట లోని టీటీడీ గెస్ట్ హౌస్ లో సీఎం బస చేయనున్నారు.
READ MORE: Allahabad HC: మరో వివాదంలో అలహాబాద్ హైకోర్టు.. “అత్యాచార” తీర్పుపై సర్వత్రా విమర్శలు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!