Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్గా ఇండిగో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల సాకారమైనట్లయింది. భోగాపురం విమానాశ్రయానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగోకు చెందిన 6E 6408 విమానం చేరుకుంది. ఉదయం 6:44 గంటలకు వచ్చిన ఈ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్గా నిలిచింది. విమానాశ్రయంలో తొలి ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు.
జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే విమాన సర్వీసుల సందడి ప్రారంభమైంది. తొలుత స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం భోగాపురం నుంచి సింగపూర్కు బయలుదేరింది. అనంతరం సోమవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. తొలి రోజు భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు విమానాలు బయలుదేరనున్నాయి. ఉదయం 7:30 గంటల తర్వాత హైదరాబాద్కు తొలి విమానం వెళ్లనుండగా.. ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, 8:20 గంటలకు ఢిల్లీకి, 8:50 గంటలకు హైదరాబాద్కు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read
- The Hundred Women's Champions: కావ్య మారన్కు నిరాశ.. ఫైనల్లో సన్రైజర్స్పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
- The Hundred Men's Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి 'ది హండ్రెడ్' ఛాంపియన్స్గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
- Mu*rder: బాలాపూర్లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి దేశీయ విమానయాన సంస్థలతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. తొలి రోజైన సోమవారం మొత్తం 31 విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వీటి ద్వారా సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీలక రవాణా కేంద్రంగా మారనుంది.
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు 20 విద్యుత్తు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు విస్తరించడంతో రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయం మరింత కీలకమైన ఏవియేషన్ హబ్గా ఎదిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్గా ఇండిగో!
-
Nokia 2660 Flip 4G: రూ.4,999కే నోకియా 4G ఫ్లిప్ ఫోన్.. డ్యూయల్ డిస్ప్లే, 1450mAh బ్యాటరీతో Nokia 2660 Flip
-
Mollywood : ఫీమేల్ సెంట్రిక్ ఇండస్ట్రీహిట్ చిత్రాన్ని బీట్ చేయలేకపోతున్న మాలీవుడ్ స్టార్స్
-
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
-
The Hundred Women’s Champions: కావ్య మారన్కు నిరాశ.. ఫైనల్లో సన్రైజర్స్పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?