CM Chandrababu: మంత్రి నారా లోకేష్ని కొనియాడిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?
- మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుంది
- చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారు
- మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచే చేస్తారు
- టీడీపీ కార్యక్రమంపై పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్ను సీఎం కొనియాడారు. చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారన్నారు. మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచి నియోజకవర్గంగా మార్చుతారని తెలిపారు. దీనికి ఉదాహరణ లోకేష్.. 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని సూచించానని చెప్పారు. లేదు మంగళగిరిలో ఎప్పుడూ గెలవలేదు, అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారన్నారు. నెల ముందు నియోజకవర్గానికి వెళ్లారని.. తక్కువ మెజారిటీతో ఓడిపోయారన్నారు. ముందే వచ్చి ఉంటే గెలిచేవారని.. అయినా నియోజకవర్గంలో ఐదేళ్లు కష్టపడి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించారని కొనియాడారు. అది ఆయనకు ఉన్న పట్టుదల అని.. ఇప్పుడు గెలిచాక మళ్లీ జాగ్రత్తగా చూసకుంటున్నారన్నారు. మొదటిసారి గెలిచిన వాళ్లు కూడా ఈ విధంగానే పని చేయాలన్నారు.
READ MORE: Indigo Flight: హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Also Read
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
- Alluri Sitarama Raju International Airport: 'ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి'
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది యువకులు ఉన్నారని.. తాను 9వ సారి ఎమ్మెల్యే అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. “మొదటి సారి గెలిచిన వాళ్లు వచ్చి ఏం చేయాలో నాకు చెప్తున్నారు. మీరు అలా చేయండి, ఇలా చేయండని అంటున్నారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలని యువతకు అవకాశం ఇచ్చాను.. దాన్ని వినియోగించుకోండి. దేశంలో యంగెస్ట్ అసెంబ్లీ టీడీపీ. యంగెస్ట్ పార్లమెంట్ పార్టీ టీడీపీ. ఇటీవల అమిత్ షా కూడా అదే మాట అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పాపులర్ అవుతున్నారు.. మరికొంత మంది పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఈ విషయంలో మీకు మీరే సమర్థించుకుంటున్నారు. కార్యకర్తలతో ప్రజాప్రతినిధులు అనుసంధానం కావాలి. మన హైకమాండ్ వాళ్లే. స్థానికంగా సమర్థులనే ప్రోత్సహించాలి. మనం ఏం చేసినా ప్రజలు గమనిస్తారు. నేను ఇచ్చిన సూచనలు తీసుకుని పనితీరు మార్చుకుంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారు. లేదంటే మీ ఇష్టం. అర్థం చేసుకుంటారనే స్పష్టంగా చెప్తున్నా. ఇక ఎవరిపట్లా మొహమాటం ఉండదు.” అని సీఎం స్పష్టం చేశారు.
READ MORE: Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
తాజావార్తలు
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!