CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నెమకల్లులో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
- గ్రామసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఈరోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన విషయంగా మారిపోతుంది. అందువల్ల, ప్రభుత్వం డిసెంబర్ 1న పెన్షన్ అందించలేని పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో, పెన్షన్ ను ఈ రోజు (నవంబర్ 30) పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం 100 శాతం పంపిణీని ఈ రోజు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
lizard: బల్లి కరిస్తే ఏం జరుగుతుంది? బల్లి పడిన ఆహారం తింటే ప్రమాదమా?
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ పనిలో భాగంగా, సచివాలయ ఉద్యోగులు ఉదయాన్నే నిద్ర లేవడంతో పాటు, పెన్షన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. వారికి పని పూర్తి చేయడం కోసం ఏ విధమైన జాప్యం జరగకుండా, ఇవాళే 100% పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పొరపాటున ఎవరైనా మిస్సైతే, సోమవారమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, అధికారులు, కలెక్టర్లు ఈ పని పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఏపీ ప్రభుత్వం మొత్తం 26 రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తోంది, వీరిలో వృద్ధులు, వితంతువులు, తలసేమియా బాధితులు, ఒంటరి మహిళలు, అభయహస్తం లబ్దిదారులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు వంటి వర్గాలు ఉన్నాయి. వీరందరికీ పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు 29వ తేదీన బ్యాంకుల నుండి మనీ తీసుకున్నారు. అందువల్ల, ఇవాళ అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ సందడి వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో మొత్తం 64,14,174 మంది పెన్షన్ దారులున్నారు. నవంబర్ నెలకి 63,70,509 మంది పెన్షన్ పొందారు, అయితే 43,665 మంది వివిధ కారణాల వల్ల పెన్షన్ పొందలేదు. ఈ 43,665 మందికి డబుల్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారు నవంబర్ 30న రెండు నెలల పెన్షన్లు పొందుతారు. అందువల్ల, సచివాలయ ఉద్యోగులు వారి ఇళ్లకు వచ్చేటప్పుడు, వారికి రెండు పెన్షన్లు ఇవ్వాలని గుర్తు చేయడం అవసరం.
CM Chandrababu: రాజ్భవన్కు సీఎం చంద్రబాబు.. గవర్నర్, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!