Bhatti Vikramarka: బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్.. భట్టి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం పేరుతో గతంలో చేసిన మోసం మళ్ళీ చేయనున్నారని ఆయన ఆరోపించారు. మోసం చేసే కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, దొరల కోసం కాదన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపి బీజేపీకి బీ టీమ్గా మాదిరిగా పనిచేస్తోందని భట్టి ఆరోపించారు. ఎంఐఎం ఈ టీమ్కు వంత పలుకుతోందన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేయడం బీజేపీ వేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం రెండింటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర భూములను అమ్మేసుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.
Also Read: Sajjala Ramakrishna Reddy: స్కాంలలో సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారుడు చంద్రబాబు
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
- Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆరు గ్యారెంటీ స్కీమ్లను ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు. జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్న పార్టీలతో చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీలతో కలసి పోవడం కోసం చర్చలు సాగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు చేస్తోందన్నారు. అభ్యర్థుల ప్రకటన నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ప్రకటన చేస్తుందన్నారు. అభ్యర్థులపై సంపూర్ణ కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పద్దతి ప్రకారం ఇప్పటికే అభ్యర్థుల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ప్రకటన త్వరలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఇంకా జరుగలేదని.. మీడియాలో వస్తున్న లిస్ట్ కథనాలపై పార్టీకి ఎటువంటి సంబందం లేదన్నారు. అవన్నీ అభూత కల్పన మాత్రమేనన్నారు. లెఫ్ట్ కు కేటాయించిన సీట్లు ఇవే అంటూ తప్పుడు కథనాలు నమ్మవద్దన్నారు. చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
-
Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
-
Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
-
Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!