Chiranjeevi: 72 మందితో చిరు భేటీ.. సమ్మెకు ముగింపు?
- * సమ్మెకు ముగింపు పలికేందుకు రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి. * 24 క్రాఫ్ట్స్కు చెందిన 72 మందితో రెండు గంటల పాటు చిరంజీవి ముఖాముఖి. * నిర్మాతలు, కార్మికుల మధ్య దూరం తగ్గించి సమస్యకు పరిష్కారం చూపుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.
నిన్న మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఒక కీలకమైన సమావేశం నిర్వహించారు. అందులో 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో, ఒక సెలబ్రిటీగా లేదా హీరోగా కాకుండా సినీ పరిశ్రమలో ఒకరిగా ఆయన అన్ని సమస్యలను విని నోట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరినీ మాట్లాడించే అవకాశం ఇచ్చిన ఆయన, తనకు వచ్చిన అనుమానాలను వారితోనే నివృత్తి చేసుకున్నట్లు సమాచారం.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Miss Universe India 2025: ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా మణిక విశ్వకర్మ!
అలాగే ఫెడరేషన్ కార్మికులు, నిర్మాతల మధ్య దూరం ఎందుకు పెరిగింది అనే విషయం మీద కూడా ఆయన ఈ సమావేశంలో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాక, కార్మికులను కూడా గౌరవంతో చూసినప్పుడే సినీ పరిశ్రమలో మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. నిన్న 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో దాదాపుగా ఆయన ముఖాముఖి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే విషయం ఆ 72 మంది దాదాపుగా వివరించినట్లుగా సమాచారం. ఇక ఈరోజు,రేపటిలో ఈ సమ్మెకు ఒక ముగింపు పలికే దిశగా మెగాస్టార్ చిరంజీవి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు త్వరలోనే ముగింపు దొరికే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!