Chinna Reddy : విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దు.. త్వరలో 20వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్
- విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి
- 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం
- మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసాం
- మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసామని, మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ వాయిదా పడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిసారి సచివాలయం సీఎం ఇంటిని ముట్టడించడం భాగం కాదని ఆయన తెలిపారు. మీ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవనానికి రండి అని ఆయన తెలిపారు. మేము వింటాము ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామని చిన్నారెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు విద్యార్థులను రెచ్చగొట్టవద్దని ఆయన అన్నారు. ఇలాంటి చిల్లర ఉద్యమాల వల్ల పలచన అవుతారని, ఈ ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండన్నారు. కృత్తిమ ఉద్యమాలకు విద్యార్థులు బలి కావద్దని, ఈ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఉందన్నారు చిన్నారెడ్డి.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
డీఎస్సీని వాయిదా వేయవచ్చు కానీ, కోచింగ్ సెంటర్ల నిర్వాహకము వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవాని రావాలని, ప్రజావాణి వచ్చి సమస్య చెప్పుకోండన్నారు. విద్యార్థులు అవసరమైతే మమ్మల్ని కొట్టినా కూడా పడేందుకు సిద్ధమన్నారు చిన్నారెడ్డి. గత ప్రభుత్వం ఎందుకు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చారన్నారు. అందరికి ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఖజానా ఖాళీగా ఉందన్నారు. అయినా ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు చిన్నారెడ్డి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?