Cyber Fraud Arrest: 100 కోట్లకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన చైనా వ్యక్తి అరెస్ట్
- రూ.100 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసం.
- చైనా వ్యక్తి అరెస్ట్
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud Arrest: 100 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన చైనా పౌరుడిని ఢిల్లీ రాష్ట్రంలోని షాహదారా జిల్లా సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫెంగ్ చుంజిన్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను ట్రాప్ చేసేవాడు. నిందితుడి నుంచి మోసానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సురేశ్ కొలిచియిల్ అచ్యుతన్ 2024 జూలై 24న సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. అందులో తాను స్టాక్ మార్కెట్లో నకిలీ ట్రేడింగ్లో ఇరుక్కున్నానని, 43.5 లక్షల పెట్టుబడి ద్వారా మోసపోయానని ఫిర్యాదుదారు చెప్పాడు.
Also Read: IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైం, లైవ్ స్ట్రీమింగ్.. ఫుల్ డిటైల్స్ ఇవే
Also Read
- BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
- Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
కేసును తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని, సైబర్ ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ మార్గదర్శకత్వంలో అలాగే ఏసిపి గురుదేవ్ సింగ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రాజీవ్, హెచ్సి సజ్జన్ కుమార్, హెచ్సి జావేద్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇకపోతే, ఈ పెట్టుబడులను మోసగాళ్లు పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. విచారణలో, మోసపోయిన మొత్తాన్ని బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలను బృందం సేకరించి, అనుమానాస్పద మొబైల్ నంబర్ కాల్ వివరాలను విశ్లేషించింది. అనుమానిత వ్యక్తులందరికీ సంబంధించిన బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక విశ్లేషణ, బృందం ప్రయత్నాలు మోసానికి లింక్లను వెల్లడించాయి.
Also Read: Mechanic Rocky: షేప్ అవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు.. అదరగొట్టిన విశ్వక్
ఢిల్లీలోని ముండ్కాలో ఉన్న మహాలక్ష్మి ట్రేడర్స్ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు సంబంధించిన నిధులను బృందం ట్రేస్ చేసింది. ఏప్రిల్ 24, 2024న రూ.1.25 లక్షల బదిలీ జరిగిన మోసపూరిత లావాదేవీకి ఈ ఖాతా లింక్ చేయబడినట్లు కనుగొనబడింది. ఆ తర్వాత దర్యాప్తు బృందం రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్కు ట్రేస్ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న చైనా జాతీయుడు ఫెంగ్ చెన్జిన్ వద్ద నుంచి మొబైల్ ఫోన్, వాట్సాప్ చాట్ లాగ్లతో సహా సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్న తర్వాత అతనిని అరెస్టు చేశారు. స్కామ్లో ఉపయోగించిన మొబైల్ నంబర్ను రీఛార్జ్ చేయడంతో సహా మోసపూరిత కార్యకలాపాలకు అతను నేతృత్వం వహిస్తున్నట్లు అతనికి, అతని సహచరుడికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు స్పష్టంగా వెల్లడించాయి. ఈ కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో సైబర్ క్రైమ్ ఇంకా మనీలాండరింగ్కు సంబంధించిన మరో రెండు ముఖ్యమైన మోసం కేసులతో ఫాంగ్ చెంజిన్కు సంబంధం ఉందని తదుపరి విచారణలో వెల్లడైంది. సైబర్ క్రైమ్ పోర్టల్లో మొత్తం 17 క్రిమినల్ ఫిర్యాదులు నమోదయ్యాయి. అన్నీ ఒకే ఫిన్కేర్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడ్డాయి. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా మోసం జరిగింది.
తాజావార్తలు
-
Team India: వైభవ్ సూర్యవంశీలా.. ఆ స్టార్ ఆటగాడి కెరీర్ను కూడా గంభీర్ నాశనం చేస్తున్నాడు!
-
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
-
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!