China: కెనడా, బ్రిటన్లకు చైనా ‘వీసా’ గిఫ్ట్.. ‘ఫైవ్ ఐస్’ కూటమిలో మిగిలింది అమెరికా మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: డ్రాగన్ దేశం రెండు దేశాలకు ప్రకటించిన బంపర్ ఆఫర్ను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకీ చైనా ఏం చేసిందో తెలుసా.. కెనడా, బ్రిటన్ పౌరులకు వీసా లేకుండా వారి దేశంలోకి ఎంట్రీ కల్పిస్తుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ నియమం ఫిబ్రవరి 17, మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది.
READ ALSO: Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?
Also Read
కెనడా, బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు వీసా లేకుండా గరిష్టంగా 30 రోజులు చైనాలో ఉండగలరు. ఇక వారు వ్యాపారం, పర్యాటకం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవడానికి ఎలాంటి వీసా లేకుండా చైనాకు ప్రయాణించవచ్చు. కెనడియన్ ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఇటీవల చైనాను సందర్శించిన తర్వాత ఈ ప్రకటన రావడం విశేషం. ఈ పర్యటనల తర్వాత చైనా ఈ రెండు దేశాలతో సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ది ఫైవ్ ఐస్ అనేది యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో కూడిన గూఢచార భాగస్వామ్య సమూహం. ఇది పాశ్చాత్య దేశాలకు కీలకమైన భద్రతా కూటమిగా పరిగణించబడుతుంది. ఈ సమూహంలో చైనా వీసా రహిత ప్రయాణాన్ని మంజూరు చేయని ఏకైక దేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్. చైనా గతంలో జూలై 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పౌరులకు వీసా-రహిత ప్రవేశాన్ని మంజూరు చేసింది. దీని ప్రకారం.. నాలుగు ఫైవ్ ఐస్ దేశాల పౌరులు (బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) ఇప్పుడు 30 రోజుల వరకు వీసా లేకుండా చైనాకు ప్రయాణించవచ్చు.
అమెరికాకు ఇవ్వకపోవడానికి కారణాలు..
చైనా తీసుకున్న తాజా నిర్ణయం కొన్ని పాశ్చాత్య దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న దౌత్య ప్రయత్నాల్లో భాగమే నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సౌకర్యం నుంచి అమెరికాను మినహాయించడం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను కూడా ప్రతిబింబిస్తుందని సూచిస్తున్నారు. చైనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని మంజూరు చేసింది. అంటే ఈ దేశాల పౌరులు కొన్ని షరతులకు లోబడి 30 రోజుల వరకు వీసా లేకుండా చైనాలో ఉండగలరు. ఈ నిర్ణయం చైనా కొత్త ఓపెన్ ట్రావెల్ పాలసీలో భాగం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఆకర్షించడం, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని చైనా అధికారులు వర్గాలు పేర్కొంటున్నాయి.
READ ALSO: Arjun Sarja: నటుడు కావడం మా నాన్నకు ఇష్టం లేదు.. అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!