Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News China Eyeing Bhutan Border Dispute Doklam

China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!

Published Date :September 11, 2025 , 4:00 pm
By Shiva Ganesh
China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

China – Bhutan: ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా. ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్‌పై పడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 1950ల నుంచి చైనా – భూటాన్‌ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. కానీ 2020లో చైనా – భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సక్తెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం. 2020లో జరిగిన గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ సమావేశంలో చైనా భూటాన్ భూమిపై తన వాదనను వినిపించింది. అయితే భూటాన్- చైనా వాదనలను పూర్తిగా తిరస్కరించింది.

READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదు: సీఆర్‌పీఎఫ్..

గొర్రెల కాపరులను పంపి.. ఆక్రమణ
చైనా మొదట ఇతర దేశాల భూమిలోకి తన గొర్రెల కాపరులను పంపి క్రమంగా ఆయా దేశాల భూమిని ఆక్రమించుకుంటుంది. తరువాత అక్కడ డ్రాగన్ సేనలు గస్తీ తిరుగుతూనే కొంచెం లోపలికి వెళ్తాయి. ఒక వేళ వివాదం తీవ్రమైతే, చర్చల తర్వాత డ్రాగన్ సైన్యం రెండు అడుగులు వెనక్కి వెళ్లి, తరువాత మళ్లీ గస్తీ తిరుగుతూ ఇతర దేశాల సైన్యాన్ని లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇదే విధానాన్ని భారతదేశంతో అవలంభించడానికి అనేక విఫల ప్రయత్నాలు చేసింది చైనా. 2017లో డోక్లామ్‌లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నించింది.

రాయల్ భూటాన్ ఆర్మీ (RBA) సైనికులను డోక్లాం సమీపంలోని అమో-చు నది ఒడ్డున వారి స్వంత ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే చైనా సైనికులు ఆపివేసినట్లు కథనాలు వచ్చాయి. చైనాలోని చుంబి లోయలో పుట్టిన తోర్షా నది అమో-చు నదిగా భూటాన్‌లోకి ప్రవహిస్తుంది. డోక్లాం చేరుకున్న తర్వాత తోర్షా నది రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక తోర్షా డోక్లాం నుంచి జంఫేరి రిడ్జ్ వరకు కాల్వగా దక్షిణం వైపు ప్రవహిస్తుంది. మరొకటి తూర్పున భూటాన్‌లో అమో-చుగా విడిపోతుంది. ప్రత్యేకత ఏమిటంటే రాయల్ భూటాన్ సైన్యం పశ్చిమ భూటాన్‌లోని అమో-చు తూర్పు ఒడ్డున ఉన్న క్రాసింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి చేరుకున్నప్పుడు వారి సొంత స్థలంలో చైనా సైనికులు వారిని ఆపడం. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఇరుదేశాల మధ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భూటాన్ సైన్యం గస్తీ తిరగడాన్ని చైనా PLA అభ్యంతరం వ్యక్తం చేసింది.

పలు నివేదికల ప్రకారం.. టిబెట్-భూటాన్ సరిహద్దుకు సమీపంలోని పచ్చిక బయళ్లకు వెళ్లకుండా భూటాన్ సైన్యం చైనా గొర్రెల కాపరులను ఆపింది. దీనిపై ఆగ్రహించిన చైనా జిల్లా యంత్రాంగం రాయల్ భూటాన్ సైన్యం ముందు ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగిన సమావేశంలో గొర్రెల కాపరులను ఆపవద్దని చైనా భూటాన్ సైన్యానికి తెలిపింది. అలాగే గొర్రెల కాపరులను టిబెటన్ గొర్రెల కాపరులుగా కాకుండా చైనీస్ గొర్రెల కాపరులుగా పిలువాలని డ్రాగన్ సైన్యం చెప్పినట్లు సమాచారం.

2017లో డోక్లాంలో భారతదేశం చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, చైనా మళ్లీ ఆ ప్రాంతాలలో పనులను వేగవంతం చేసింది. తోర్షా నాలా ముందు రోడ్డు నిర్మించకుండా చైనాను ఆపారు. కానీ డోక్లాంలో కూడా చైనా తన సన్నాహాలను పెంచింది. ఇప్పుడు తోరసా నాలా ప్రాంతంలో చైనా తన రక్షణను బలోపేతం చేస్తోన్నట్లు సమాచారం. దాదాపు 477 కి.మీ పొడవైన సరిహద్దుపై 80ల నుంచి చైనా – భూటాన్ మధ్య వివాదం ఉంది. అత్యంత వివాదం ఉన్న రెండు ప్రాంతాలలో ఒకటి 269 చదరపు కిలోమీటర్ల డోక్లాం ప్రాంతం. రెండవది భూటాన్‌కు ఉత్తరాన ఉన్న 495 చదరపు కిలోమీటర్ల జకర్‌లంగ్, పసమ్‌లంగ్ లోయ. అక్టోబర్ 2021లో చైనా – భూటాన్ ‘త్రీ-స్టెప్ రోడ్‌మ్యాప్’ ఒప్పందంపై సంతకం చేశాయి. గత 8 ఏళ్లలో భూటాన్ భూమిలో 20 కి పైగా గ్రామాలు పుట్టుకువచ్చాయి. ఇందులో డోక్లాంలోనే 8 గ్రామాలు ఏర్పడ్డాయి.

READ ALSO: Malati Murmu: మేడం సర్.. మేడం అంతే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhutan China tensions
  • China Bhutan border dispute
  • China expansionism South Asia
  • China eye on Bhutan
  • Doklam standoff

తాజావార్తలు

  • Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

  • Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!

  • LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

  • Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్

  • GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

ట్రెండింగ్‌

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions