Rahul Gandhi: రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదు: సీఆర్పీఎఫ్..
- రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ను ఉల్లంఘిస్తున్నారు..
- విదేశీ ప్రయాణాలపై లేఖ రాసిన సీఆర్పీఎఫ్..
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు.
ఇటలీ (డిసెంబర్ 30 నుండి జనవరి 9), వియత్నాం (మార్చి 12 నుండి 17), దుబాయ్ (ఏప్రిల్ 17 నుండి 23), ఖతార్ (జూన్ 11 నుండి 18), లండన్ (జూన్ 25 నుండి జూలై 6),మలేషియా (సెప్టెంబర్ 4 నుండి 8) వంటి దేశాలకు గాంధీ చేసిన విదేశీ పర్యటనలను CRPF అధికారి ప్రస్తావించారు. CRPF యొక్క ఎల్లో బుక్లో పేర్కొన్న ప్రోటోకాల్లను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. అయితే, ఈ విషయంపై రాహుల్ కానీ, ఖర్గే కానీ స్పందించలేదు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Charlie Kirk: “ఆపరేషన్ సిందూర్” గురించి హత్యకు గురైన చార్లీ కిర్క్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష్ నేత రాహుల్ గాంధీకి ప్రస్తుతం అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైజన్(ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. Z+ ASL అనేది గణనీయమైన ముప్పును ఎదుర్కొంటున్న వ్యక్తులకు కల్పించే అత్యున్నత భద్రత. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలతో సహా దాదాపు 55 మంది భద్రతా సిబ్బందిని కలిగి ఉంటుంది. ASL కింద, భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు, నిఘా అధికారుల సమన్వయంతో వీఐపీలు సందర్శించే ప్రదేశాల్లో ముందస్తు నిఘా నిర్వహిస్తారు.
సీఆర్పీఎఫ్ ఇలా లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో రాహుల్ గాంధీ 2020 నుంచి 113 సార్లు భద్రతా మార్గదర్శకాలనున ఉల్లంఘించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. వీటిలో భారత్ జోడో యాత్ర కూడా ఉంది. 2023లో కాశ్మీర్లో యాత్ర సాగిన సమయంలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరినప్పుడు భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!