Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chief Minister Chandrababu Naidu Made Key Comments With The Ministers In The Cabinet

CM Chandrababu: కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ..

Published Date :August 28, 2024 , 5:30 pm
By Rajesh Veeramalla
  • మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు- చంద్రబాబు
  • ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బ తింటోంది- సీఎం
  • మంత్రులు జాగ్రత్తగా ఉండాలి- చంద్రబాబు
  • జిల్లాల్లో ఎమ్మెల్యేలు.. నాయకులను మంత్రులు గైడ్‌ చేయాలి- సీఎం.
CM Chandrababu: కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్

రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ
మరోవైపు.. రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని కేబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని.. ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ కేబినెట్లో చర్చ జరిగింది. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని కేబినెట్ భావించింది. తాను చేసిన తప్పులకు ఓ జడ్జీతో ఆమోద ముద్ర వేసేలా జుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలని కోరారు.

ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ
అలాగే.. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కేబినెట్లో చర్చించారు. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా కేబినెట్ అంగీకారం తెలపింది.

రేషన్ బియ్యం డెలివరీ వాహనాల రద్దుపై చర్చ
సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపిస్తే విమర్శలు వస్తాయేమోనని పలువురు మంత్రులు సూచించారు. మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ భావించింది. ఈ క్రమంలో.. రేషన్ బియ్యం డెలివరీ వాహనాలను రద్దు చేయాలనే నిర్ణయంపై కేబినెట్లో చర్చించారు. వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు అధికారులు చెప్పారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. బ్యాంక్ లింకేజీ ఉన్నందున్న ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు.. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే.. ఫ్రీ హోల్డులోకి వెళ్లిన భూముల్లో ఎక్కువగా 5 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని అధికారులు తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను డీటైల్డుగా విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cabinet meeting
  • cm chandrababu
  • key comments
  • ministers
  • telugu news

తాజావార్తలు

  • Ajinkya Rahane: నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు.. రహానే సంచలన వ్యాఖ్యలు!

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions