Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణకు బిల్లు తీసుకువచ్చిన ఛత్తీస్గఢ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది.
మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారని ఈ చట్టం అందరిని సంప్రదించి చేశామని సీఎం బఘేల్ అన్నారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలోని ప్రెస్ క్లబ్లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందా అని ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, అజయ్ చంద్రాకర్ సహా బీజేపీ శాసనసభ్యులు ప్రశ్నించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
Read Also: Hospital Bill : ఆస్పత్రి బిల్లు చూశాడు.. ఎలా చావాలో గూగుల్లో సెర్చ్ చేశాడు
జర్నలిస్టుల ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ బిల్లు ప్రకారం ఓ వ్యక్తి జర్నలిజంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుత సంఘటనపై మీడియా సంస్థలో కనీసం 6 కథనాలను ప్రచురించాలి లేదా కనీసం మూడు నెలల జీతాన్ని సదరు మీడియా సంస్థ నుంచి పొందాలి. మీడియా పర్సన్ అంటే ఎడిటర్, రైటర్, న్యూస్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, ఫీచర్ రైటర్, కరస్పాండెంట్, కాపీ ఎడిటర్, కమ్యూనికేటర్, కార్టూనిస్ట్, న్యూస్ ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ట్రాన్స్లేటర్, ట్రైన్ జర్నలిస్టులుగా బిల్లులో పేర్కొన్నారు.
చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు ‘ఛత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఇది మీడియా పర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు మరియు అరెస్టు వంటి మీడియా వ్యక్తుల రక్షణకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్/ పోలీస్ అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్ అధికారితో పాటు ముగ్గురు మీడియా వ్యక్తులు ఇందులో ఓ మహిళా కూడా ఉంటారు.
ఒక ప్రైవేట్ వ్యక్తి హింసకు, వేధింపులకు లేదా మీడియా ప్రతినిధిని భయపెట్టడానికి కారణమైతే, కమిటీ, కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, నేరస్థుడిపై రూ. 25,000 జరిమానా విధించవచ్చు. ఏదైనా కంపెనీ మీడియా ప్రతినిధిని బెదిరింపులకు, హింసకు లేదా హింసకు కారణమైతే, కమిటీ కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అర్హులైన మీడియా ప్రతినిధుల నమోదులో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, కమిటీ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సంబంధిత వ్యక్తికి రూ.25,000 జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!