Cheetah in LB Nagar: ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుత సంచారం.. ఆందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheetah in LB Nagar: చిరుతలు ఎక్కడో అడవుల్లో ఉన్నారని అనుకుంటారు కానీ.. ఇప్పుడు ఆ చిరుతలు పట్నంలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నెం.6లో గురువారం అర్ధరాత్రి చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంటి ఆవరణలో మధ్యాహ్నం 12:30 గంటలకు చిరుతపులి సంచరించిందని యజమాని అఖిల్ తెలిపారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చేలోపే చిరుత ఏరోనాటికల్ కంపెనీ గోడ దూకి అడవిలోకి పారిపోయిందని అఖిల్ వివరించాడు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుత పాదాలను పరిశీలించారు. చిరుత అడవిలోకి వెళ్లిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా చిరుతపులి 24 గంటల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Read also: AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ లెక్కన చిరుతపులి ఇబ్రహీంపట్నం అడవుల్లోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి కదలికలను గుర్తించేందుకు పలుచోట్ల కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎటువైపు నుంచి వస్తుందోనని భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారుల బృందం మరోసారి ఈ ప్రాంతాన్ని సందర్శించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు. ‘ఆ చిరుతపులి ఒక్కటి తప్ప మరెవరూ చూడలేదు. అయితే ఆ స్థలంలో రెండు బోనులను ఉంచి తగు జాగ్రత్తలు తీసుకున్నాం’ అని అటవీ రేంజ్ అధికారి తెలిపారు. ఏవియేషన్ అకాడమీ ప్రవేశం, నిష్క్రమణ వద్ద బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఎల్బీ నగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని, ఆటోనగర్లోని డంప్యార్డులో కుక్కలను వేటాడినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టకేలకు దాన్ని పట్టుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో విడిచిపెట్టినట్లు సమాచారం.
AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!