Nitya Pellikoduku : మేడ్చల్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్ చేసి అత్తారింటికి..!
- మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకున్న ర్యాపిడో డ్రైవర్
- ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
కేసు వివరాలు:
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ గబ్బిబాల్పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషతో అతనికి వివాహమైంది. అయితే కొంతకాలానికే అనూషతో మనస్పర్థలు ఏర్పడి ఆమెతో దూరంగా ఉంటున్నాడు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
రెండో పెళ్లి:
ఈ సమయంలో బాలాజీనగర్కు చెందిన లీలావతి (25)తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి 2021లో మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొంతకాలానికే లీలావతితో కూడా విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా వదిలేసి తప్పించుకుని తిరగసాగాడు.
మూడో పెళ్లి:
2022లో శబరి అనే మరొక యువతితో పరిచయం పెంచుకున్న లక్ష్మణరావు, ఆమెను కూడా మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నాడు.
రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు లక్ష్మణరావు గురించి ఆరా తీసి మల్కాజిగిరి వద్ద అతని అడ్రెస్ తెలుసుకున్నారు. అక్కడకు చేరుకోగా అతను శబరితో జీవిస్తున్న విషయం బయటపడింది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న విషయం వెలుగుచూసింది.
లీలావతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన జవహర్నగర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ముగ్గురితో వివాహం చేసి వారి జీవితాలను మోసం చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజావార్తలు
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!