Chandrayaan 3 Postpone: చంద్రయాన్3 ల్యాండింగ్ ఆలస్యం కానుందా? మరో తేదీకి పోస్ట్ పోన్ అవుతుందా?
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్ మాడ్యూల్కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ రేపు కనుక చంద్రయాన్ 3 ల్యాండింగ్ జరగకపోతే ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ఇక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందే ఓసారి మొత్తం అన్ని విషయాలను పరిశీలిస్తామని అప్పటి ల్యాండర్ పరిస్థితులు, చంద్రుడిపై పరిస్థితులు బేరీజు వేసుకొని చంద్రయాన్ 3 జాబిల్లిపైకి దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని ఇస్రో తెలిపింది.
Also Read:Chandrayaan3: వెల్ కమ్ బడ్డీ… చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో లింక్ అయిన విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్
Also Read
- Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
అయితే తాజాగా చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ లింక్ అయిన సంగతి తెలిసిందే. ఇక చంద్రుడిపైకి దిగేందుకు వేచి చూస్తున్న విక్రమ్ ల్యాండర్ దానికి అనువైన పరిస్థితుల కోసం వెయిట్ చేస్తోంది. ల్యాండింగ్ సమయంలో సమస్యలు వస్తే ఆగస్టు 27వతేదీన చంద్రునిపై మాడ్యూల్ ల్యాండ్ చేస్తామని ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. అయినా ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే విక్రమ్ ల్యాండర్ ఇస్రో పై ల్యాండ్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చంద్రయాన్ 3 అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ల్యాండ్ కావాలి. ఇలా కనుక జరిగే అంతరిక్ష ప్రయోగాలలో భారత్ ఎలైట్ జాబితాలోకి చేరనుంది. చంద్రునిపై సాఫ్ట్-ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా కీర్తి ఘడించనుంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాల తరువాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలవనుంది. అయితే ప్రస్తుతం ఇస్రో చేసిన ప్రకటనతో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎప్పుడు జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపే ల్యాండింగ్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
-
Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!