Chandragiri: శానంభట్ల మంటల మిస్టరీ వీడింది.. జనాలను హడలెత్తించిన కీర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandragiri: కొత్త శానంబట్ల గ్రామంలో తలెత్తిన మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్కడ మంటలు మండుకుంటాయోనని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడివారు గడిపారు. చంద్రగిరి మండలంలోని శానంభట్ల గ్రామం తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఉన్నట్లుండి అక్కడ మంటలు వ్యాపించడం అధికార యంత్రాంగానికి అంతుపట్టని సమస్యగా మారిపోయింది. గత రెండు వారాలుగా ఇది వారికి సవాలుగా మారింది. ఏకంగా జిల్లా యంత్రాంగమంతా దృష్టి సారించేంత పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్ తో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ పర్యటించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అంతే కాదు గ్రామంలో మంత్రగాళ్ళ హడావుడి గంగమ్మను శాంతింపజేసేందుకు పొంగళ్ళు, పూజలు కూడా చేశారు. గడ్డివాములు తగలబడడం, హఠాత్తుగా బీరువాలో మంటలు చెలరేగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే ఈ కేసును చంద్రగిరి పోలీసులు ఛేదించారు.
Read Also:Large Explosion : అమెరికాలోని పెంటగావ్ సమీపంలో భారీ పేలుడు
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
శానంభట్ల ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏఎస్పీ వెంకట రావు మీడియాతో వివరాలు వెల్లడించారు. కొందరు ఆకతాయిలు ఊరిలోని ఓ గడ్డివాముకు మొదట నిప్పు పెట్టారు. ఇదే అదునుగా భావించిన కీర్తి అనే మహిళ బంధువులపై విద్వేషంతో తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత కీర్తి వరుసగా తన బంధువుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఊరిలో ఏదో జరిగిపోతోంది అంటూ ప్రచారం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకున్న ఘటనను అదునుగా చేసుకొని మరో గడ్డువాముకి నిప్పంటించిందని చెప్పారు. తల్లి ప్రవర్తన మార్పుకోసం వరుసగా ఇలాంటి పనులు చేసిందన్నారు. 12 వరుస అగ్నిప్రమాదాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్నిప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగించలేదని, ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తి యాంత్రిక శక్తులు వినియోగించలేదని చెప్పారు. వరుస అగ్ని ప్రమాదాలు జరిగితే తల్లితో కలిసి ఊరు వదిలి వెళ్లే అవకాశముంటుందని ఇలా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 12 అగ్నిప్రమాద ఘటనలకు పాల్పడింది. మంటల కోసం ఎలాంటి రసాయనాలు వాడలేదని, అగ్గిపెట్టెతోనే నిప్పు పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తి పోలీసుల అదుపులో ఉంది. అయితే, ఈ అగ్నిప్రమాదాల వల్ల నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందించడం చూసి.. పలువరు అత్యాశతో కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. ఇలా గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also:CM KCR : జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరణపై కసరత్తు
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!