Chandragiri: శానంభట్ల మంటల మిస్టరీ వీడింది.. జనాలను హడలెత్తించిన కీర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandragiri: కొత్త శానంబట్ల గ్రామంలో తలెత్తిన మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్కడ మంటలు మండుకుంటాయోనని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడివారు గడిపారు. చంద్రగిరి మండలంలోని శానంభట్ల గ్రామం తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఉన్నట్లుండి అక్కడ మంటలు వ్యాపించడం అధికార యంత్రాంగానికి అంతుపట్టని సమస్యగా మారిపోయింది. గత రెండు వారాలుగా ఇది వారికి సవాలుగా మారింది. ఏకంగా జిల్లా యంత్రాంగమంతా దృష్టి సారించేంత పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్ తో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ పర్యటించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అంతే కాదు గ్రామంలో మంత్రగాళ్ళ హడావుడి గంగమ్మను శాంతింపజేసేందుకు పొంగళ్ళు, పూజలు కూడా చేశారు. గడ్డివాములు తగలబడడం, హఠాత్తుగా బీరువాలో మంటలు చెలరేగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే ఈ కేసును చంద్రగిరి పోలీసులు ఛేదించారు.
Read Also:Large Explosion : అమెరికాలోని పెంటగావ్ సమీపంలో భారీ పేలుడు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
శానంభట్ల ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏఎస్పీ వెంకట రావు మీడియాతో వివరాలు వెల్లడించారు. కొందరు ఆకతాయిలు ఊరిలోని ఓ గడ్డివాముకు మొదట నిప్పు పెట్టారు. ఇదే అదునుగా భావించిన కీర్తి అనే మహిళ బంధువులపై విద్వేషంతో తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత కీర్తి వరుసగా తన బంధువుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఊరిలో ఏదో జరిగిపోతోంది అంటూ ప్రచారం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకున్న ఘటనను అదునుగా చేసుకొని మరో గడ్డువాముకి నిప్పంటించిందని చెప్పారు. తల్లి ప్రవర్తన మార్పుకోసం వరుసగా ఇలాంటి పనులు చేసిందన్నారు. 12 వరుస అగ్నిప్రమాదాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్నిప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగించలేదని, ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తి యాంత్రిక శక్తులు వినియోగించలేదని చెప్పారు. వరుస అగ్ని ప్రమాదాలు జరిగితే తల్లితో కలిసి ఊరు వదిలి వెళ్లే అవకాశముంటుందని ఇలా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 12 అగ్నిప్రమాద ఘటనలకు పాల్పడింది. మంటల కోసం ఎలాంటి రసాయనాలు వాడలేదని, అగ్గిపెట్టెతోనే నిప్పు పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తి పోలీసుల అదుపులో ఉంది. అయితే, ఈ అగ్నిప్రమాదాల వల్ల నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందించడం చూసి.. పలువరు అత్యాశతో కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. ఇలా గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also:CM KCR : జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరణపై కసరత్తు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!