Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!
- HYD: మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
- రూ.1.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
- 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న మహిళా వ్యాపారవేత్త
- ఈనెల 13న ఆమె పేరు, ఫోటోతో అకౌంటెంట్కు వాట్సాప్ సందేశం
- మీటింగ్లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా వీరి మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఒకప్పటి రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు.
బాధిత మహిళ సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న ఆమె కంపెనీ అకౌంటెంట్కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. సదరు వ్యాపారవేత్త పేరు , ఆమె ఫోటోతో ఉన్న నంబర్ నుంచి ఆ సందేశం రావడంతో అకౌంటెంట్ అది ఆమె పంపినదే అని నమ్మాడు. “నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, ఫోన్ కాల్స్ ఎత్తలేను.. వెంటనే నేను చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేయండి” అని ఆ సందేశంలో ఉంది. ఆ ఫోటో, మెసేజ్ చూసి తన యజమాని అని భావించిన అకౌంటెంట్, ఒకే లావాదేవీలో చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపించాడు.
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
మళ్ళీ ఈ నెల 17న అదే విధంగా మరో సందేశం రావడంతో అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. ఈసారి భారీ మొత్తం కావడంతో చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన రూ.1.20 కోట్ల వివరాలను ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాను ఎలాంటి డబ్బులు పంపమని మెసేజ్ చేయలేదని చెప్పడంతో, అది సైబర్ నేరగాళ్ల పని అని ఇద్దరికీ అర్థమైంది.
మోసపోయానని గ్రహించిన వెంటనే ఆమె 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేరళకు బయలుదేరి వెళ్లాయి. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు చూసి మోసపోవద్దని, భారీ మొత్తంలో నగదు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి