Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!
- HYD: మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
- రూ.1.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
- 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న మహిళా వ్యాపారవేత్త
- ఈనెల 13న ఆమె పేరు, ఫోటోతో అకౌంటెంట్కు వాట్సాప్ సందేశం
- మీటింగ్లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా వీరి మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఒకప్పటి రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు.
బాధిత మహిళ సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న ఆమె కంపెనీ అకౌంటెంట్కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. సదరు వ్యాపారవేత్త పేరు , ఆమె ఫోటోతో ఉన్న నంబర్ నుంచి ఆ సందేశం రావడంతో అకౌంటెంట్ అది ఆమె పంపినదే అని నమ్మాడు. “నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, ఫోన్ కాల్స్ ఎత్తలేను.. వెంటనే నేను చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేయండి” అని ఆ సందేశంలో ఉంది. ఆ ఫోటో, మెసేజ్ చూసి తన యజమాని అని భావించిన అకౌంటెంట్, ఒకే లావాదేవీలో చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపించాడు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
మళ్ళీ ఈ నెల 17న అదే విధంగా మరో సందేశం రావడంతో అకౌంటెంట్ అప్రమత్తమయ్యాడు. ఈసారి భారీ మొత్తం కావడంతో చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను సంప్రదించాడు. గతంలో పంపిన రూ.1.20 కోట్ల వివరాలను ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాను ఎలాంటి డబ్బులు పంపమని మెసేజ్ చేయలేదని చెప్పడంతో, అది సైబర్ నేరగాళ్ల పని అని ఇద్దరికీ అర్థమైంది.
మోసపోయానని గ్రహించిన వెంటనే ఆమె 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేరళకు బయలుదేరి వెళ్లాయి. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు చూసి మోసపోవద్దని, భారీ మొత్తంలో నగదు బదిలీ చేసే ముందు సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడి ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!