Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు అన్నారు.
Also Read
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
- Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో 'రామాయణం' ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్తో కట్టిపడేసిన మేకర్స్
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Earthquake: మహారాష్ట్ర నాసిక్లో భూకంపం...
అయితే, తననను పొలిటికల్ గా దెబ్బ తీసేందుకు వరుస కేసులు పెడుతున్నారని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో చోటు చేసుకున్న ఆలస్యానికి తప్పుడు కారణాలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ఏ ప్రైవేటు సంస్థ లబ్ధి పొందిందో ఎఫ్ఐఆర్లో వెల్లడించలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తే తెలుస్తుంది.. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ఉందని తెలిపారు.
Read Also: Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ
వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై గళమెత్తుతున్నామని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ తనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. అధికార పార్టీ చెప్పినట్లే ఏపీ సీఐడీ అధికారులు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఇక, ఇసుక కేసులోనూ అక్టోబరు 3న ప్రాథమిక విచారణ ప్రారంభించినా.. వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయలేదు అని చంద్రబాబు అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
-
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
-
Honor X6e: హానర్ X6e రిలీజ్.. 7,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్
-
Atlee: బాలీవుడ్లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
-
Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!