Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు అన్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అయితే, తననను పొలిటికల్ గా దెబ్బ తీసేందుకు వరుస కేసులు పెడుతున్నారని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో చోటు చేసుకున్న ఆలస్యానికి తప్పుడు కారణాలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ఏ ప్రైవేటు సంస్థ లబ్ధి పొందిందో ఎఫ్ఐఆర్లో వెల్లడించలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తే తెలుస్తుంది.. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ఉందని తెలిపారు.
Read Also: Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ
వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై గళమెత్తుతున్నామని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ తనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. అధికార పార్టీ చెప్పినట్లే ఏపీ సీఐడీ అధికారులు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఇక, ఇసుక కేసులోనూ అక్టోబరు 3న ప్రాథమిక విచారణ ప్రారంభించినా.. వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయలేదు అని చంద్రబాబు అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!