Chandrababu: త్వరలో ప్రజల్లోకి చంద్రబాబు.. ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజా గళం పేరే సరైందని చంద్రబాబు భావించారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, పెండింగులో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల పైనా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇక, ఎంపీ అభ్యర్థులతో పాటు మిగిలిన అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటన తర్వాత ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు చేపట్టే ప్రజా గళం రోడ్ మ్యాప్ ను టీడీపీ సిద్దం చేస్తోంది.
Read Also: Ananya Nagalla :కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరోయిన్.. వీడియో వైరల్..
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఇక, ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మా జెండాలు వేరే కావొచ్చు.. మా అజెండా మాత్రం ఒక్కటే అని ఆయన చెప్పుకొచ్చారు. మోడీ ఒక వ్యక్తి కాదు.. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి అని చెప్పారు. మోడీ అంటే దేశ ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం.. ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు అని టీడీపీ అధినేత తెలిపారు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలతో సంక్షేమానికి మోడీ కొత్త నిర్వచనం ఇచ్చారు అంటూ చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!